కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) విఫలమైనప్పటికీ.. జైస్వాల్ (51), కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఆట సాగలేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ భారత్ దూకుడుగా ఆడి.. ఊహించని ఫలితంను అందుకుంది. బంగ్లాను రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఆలౌట్ చేసి అద్భుత విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లా 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 95 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ టెస్ట్ మ్యాచులో భారత్ టీ20 క్రికెట్ ఆడింది.
Also Read: Mahindra Thar ROXX: అక్టోబర్ 3 నుంచి ‘థార్ రాక్స్’ బుకింగ్స్.. ఎగబడుతున్న జనం!
అద్భుత విజయంతో రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ భారత్ ఖాతాలో చేరింది. యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు. ఈ సిరీస్ విజయంతో టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన టాప్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇకపై ఆడే ఎనిమిది టెస్టుల్లో మూడు గెలిచినా.. భారత్ టాప్-2లో ఉంటుంది.