Yashasvi Jaiswal: బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్ కొన్న యశస్వి జైస్వాల్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal buys Rs 5.4 Crore Home in Mumbai: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేశాడట. ఈస్ట్ బాంద్రాలో వింగ్ 3 ఏరియాలోని 1100 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ను యశస్వి కొన్నాడట. దీని ధర దాదాపు రూ. 5.4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024 జనవరి 7న జైస్వాల్ పేరిట కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. అదానీ రియల్టీకి చెందిన బిల్డర్స్ నిర్మించిన ఈ నివాస స్థలంలో చదరపు అడుగు ధర రూ. 48 వేలుగా ఉంది.
22 ఏళ్ల యశస్వి జైస్వాల్ చిన్నపటినుంచి చాలా కష్టాలను అనుభవించాడు. 2001 డిసెంబరు 28న ఉత్తరప్రదేశ్లో జన్మించిన యశస్వికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా అతడికి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. అయితే యశస్వి 13 ఏళ్ల వయసులో సొంతూరు భదోయిని వీడిన అతడి కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ముంబైకి వచ్చిన కొత్తలో అతడు టెంట్లో నివసించేవాడు. డబ్బు కోసం పలు దుకాణాల్లో పనిచేసేవాడు. బాగా ఆడుతున్న యశస్విని కోచ్ జ్వాలా సింగ్ చేరదీశాడు. అక్కడ తన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్న యశస్వి.. ముంబై అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు.
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
Also Read: WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. షారుఖ్ స్పెషల్ పర్ఫామెన్స్!
అండర్-19, దేశవాళీ టోర్నీలలో అదరగవుతాడంతో ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడే అవకాశం వచ్చింది. ఎలాంటి బెరుకు లేకుండా.. బౌండరీలతో రెచ్చిపోయాడు. రాజస్థాన్ తరఫున 2023 సీజన్లో 14 మ్యాచుల్లోనే 625 పరుగులు చేశాడు. దాంతో టీమిండియాలో చోటు దక్కింది. గతేడాది వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ బాది తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో సిరీస్లోనూ వరుసగా సెంచరీలు బాదాడు. మూడు టెస్టుల్లోనే 545 పరుగులు సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!