Bhatti Vikramarka : అభివృద్ధికి అడ్డుకట్ట వేసే వారితో జాగ్రత్తగా ఉండాలి
- యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన
- నిరుద్యోగ యువతకు 9,000 కోట్లతో ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభం
- అభివృద్ధి కాంక్షించని శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని భట్టి విక్రమార్క సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : నగరంలోని సైబర్ గార్డెన్లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో కొందరు ఉద్యోగాలు ఇస్తామంటూ మాటలు చెప్పి మోసం చేశారు. అయితే, మేము ప్రజాపాలనలో 112 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నాం” అని చెప్పారు.
Also Read
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
“నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. 9,000 కోట్ల రూపాయలతో ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం” అని భట్టి విక్రమార్క తెలిపారు.
“అభివృద్ధి జరగకూడదని కోరుకునే శక్తులు ఉంటారు. వాళ్లను గుర్తించి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం” అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు హాజరై నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్లు, హౌస్ కీపర్స్ వంటి ఉద్యోగాల్లో నియామకాలు జరిగాయి. టీజీపీఎస్సీ ద్వారా ఆర్థిక శాఖలో నియమితులైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లకు కూడా నియామక పత్రాలు అందజేశారు.
28 Degree Celsius Review: 28 డిగ్రీ సెల్సియస్ రివ్యూ..ఆరేళ్ళ క్రితం సినిమా ఎలా ఉంది?
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..