WPL 2023 : ముంబయి ఇండియన్స్ జట్టు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ అట్టహాసంగా ముగిసింది. తొలిసారి విజేతగా ముంబయి ఇండియన్స్ జట్టు రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ముంబై టీమ్ గెలిచింది. మొట్టమొదటిసారి WPL ట్రోఫీని హర్మన్ ప్రీత్ సేన ముద్దాడింది.. సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్ లో సరికొత్త అధ్యాయానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. WPL తొలి సీజన్ ను ముంబై జట్టు మధుర జ్ఞాపకంగా ఉంచుకుంది. ఇక ఈ విజయంతో ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టు పలు విభాగాల్లో సత్తా చాటింది. పలువురు క్రికెటర్లు ఈ లీగ్ లో గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
Also Read : Manchu Manoj: విష్ణు గొడవపై స్పందించిన మనోజ్…
Also Read
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
WPL విజేత-ముంబయి ఇండియన్స్-గోల్డెన్ ట్రోఫీ.. రూ. 6 కోట్లు, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్- రూ.3 కోట్లు, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్-హేలీ మాథ్యూస్ (ముంబయి ఇండియన్స్)-రూ. 5లక్షలు, ఆరెంజ్ క్యాప్( అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్( ఢిల్లీ క్యాపిటల్స్ )-9 ఇన్సింగ్స్ లో 345 పరుగులు-రూ.5 లక్షలు, పర్పూల్ క్యాప్( అత్యధిక వికెట్లు )- హేలీ మాథ్యూస్( ముంబయి ఇండియన్స్ ) 16 వికెట్లు, ఫెయిర్ ప్లే అవార్డు-ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, క్యాచ్ ఆఫ్ ది సీజన్-హర్మన్ ప్రీత్ కౌర్( ముంబయి)-యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్-రూ.5 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ యస్తికా భాటియా( ముంబయి )-8 ఇన్సింగ్స్ లో 13 సిక్సర్లు- రూ.5 లక్షలు అందుకున్నారు.
Also Read : Today Business Headlines 27-03-23: మనమే ‘ఎక్స్-రే’ చేసుకుందాం. మరిన్ని వార్తలు
Tonight's gonna be a good good night 🏆💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #DCvMI #WPLFinal #ForTheW pic.twitter.com/qdN5Y7KYrA
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
మహిళల ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ ఛాంపియన్ లాహోర్ కలందర్స్ గెలుచుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్ గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు. 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది.
Also Read : AP Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక మలుపు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ ( 35), శిఖా పాండే ( 27నాటౌట్ ), రాధా యాదవ్ ( 27 నాటౌట్) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముంబయి బౌలర్లలో వాంగ్, హెయిలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. అమీలా కెర్ రెండు వికెట్లు తీసింది. లక్ష్య ఛేదనకు దిగిన ముంబయికి విజయం అంత ఈజీగా రాలేదు. ఓపెనర్ యాస్తికా భాటియా94), హెయిలీ మాథ్యూస్(13) నిరాశపరిచారు. బ్రంట్.. హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి ఆచితూచి ఆడారు. ఈ జోడీ మూడో వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జోరందుకున్న ఈ జోడిని కాప్సీ విడగొట్టింది. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్మన్ రనౌట్ గా వెనుదిరిగింది. అరంతరం క్రీజులోకి వచ్చిన అమీలా కెర్ ( 14 నాటౌట్) చక్కని సహకారం అందించడంతో.. మరో మూడు బంతులు మిగిలిండగానే ముంబయి టార్గెట్ ను ఛేదించి కప్పు అందుకుంది.
📂 WPL 2023
└📁 #OneFamily celebrations 🏆#MumbaiIndians #AaliRe #WPL2023 #WPLFinal #ForTheW pic.twitter.com/Xs6yZeduaT— Mumbai Indians (@mipaltan) March 27, 2023
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!