Today Business Headlines 27-03-23: మనమే ‘ఎక్స్-రే’ చేసుకుందాం. మరిన్ని వార్తలు
Today Business Headlines 27-03-23:
టీసీఎస్ రాజన్నకు అవార్డు
Also Read
- Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ రీజనల్ హెడ్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. రాజన్నకు సాఫ్ట్వేర్ సెక్టార్లో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. ఆ సుదీర్ఘ అనుభవం తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధికి మరియు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని అసోసియేషన్ పేర్కొంది. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. ఇండస్ట్రీ డెవలప్మెంట్కి, నైపుణ్యాల పెంపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
‘క్లియర్’కి హృతిక్ ప్రచారం
మంచి నీళ్ల సీసాలను విక్రయించే క్లియర్ అనే సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ని నియమించుకుంది. ఈ కంపెనీ.. ప్రీమియం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ బిజినెస్ చేస్తోంది. మోడ్రన్ టెక్నాలజీతో నీటిని శుద్ధి చేసి అమ్ముతోంది. ఈ మేరకు లేటెస్ట్ మెషినరీతో ఒక ప్లాంటును కూడా ప్రారంభించింది. ఎయిర్లైన్స్ మరియు హోటల్స్కి తమ ప్రొడక్టులను సప్లై చేస్తోంది. హృతిక్ రోషన్ని ప్రచారకర్తగా నియమించుకోవటం ద్వారా నేషనల్ లెవల్లో సంస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
నామినీకి గడువు ఈ నెల 31
మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినవారికి ముఖ్య గమనిక. వాళ్లు ఈ నెల 31వ తేదీ లోపు నామినీ వివరాలు ఇవ్వాలి. లేకపోతే.. అకౌంట్లు స్తంభించిపోతాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. హెచ్చరించింది. ఇదే జరిగితే.. ఇన్నాళ్లూ పెట్టిన డబ్బులు, వాటి మీద రావాల్సిన లాభాలు దక్కవు. ఒకవేళ నామినీ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకపోతే కనీసం ఆ విషయాన్నైనా తెలియజేయాలని సెబీ సూచించింది. ఈ మేరకు గతేడాది జూన్ 15న జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువును.. తర్వాత రెండు సార్లు పొడిగించింది. తాజాగా.. ఈ నెల 31 తేదీని చివరి తేదీగా నిర్ధారించింది.
‘రెపో’ 0.25% పెరిగే ఛాన్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వడ్డీ రేట్లను పావు శాతం పెంచే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. రెపో రేటును సున్నా పాయింట్ రెండూ ఐదు శాతం పెంచుతూ ఏప్రిల్ 6వ తేదీన ప్రకటన చేసే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల సంఘం వచ్చే నెల 3, 5, 6 తేదీల్లో సమావేశం కానుంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. మన దేశంలో కూడా ధరలు ఇంకా అదుపులోకి రాకపోవటంతో వడ్డీ రేట్లను పెంచకతప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
15%కి దిగుమతి సుంకం
ఎక్స్రే మెషిన్ల దిగుమతి సుంకం ఏప్రిల్ నుంచి 15 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం ఇది 10 శాతంగా అమలవుతోంది. నాన్-పోర్టబుల్ ఎక్స్-రే జనరేటర్ల కస్టమ్స్ డ్యూటీ కూడా 10 నుంచి 15 శాతానికి చేరనుంది. శుక్రవారం లోక్సభలో ఆమోదం పొందిన ఫైనాన్స్ బిల్లు సవరణల వల్ల ఈ పన్నుల రేటు పెరిగింది. అయితే.. ఈ పరిణామం మన దేశానికి మంచి చేయనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం మేకిన్ ఇండియాకి ఊతంగా నిలుస్తుందని పేర్కొన్నాయి. ఎక్స్రే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా ఇండియాలోనే తయారుచేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డాయి.
వివాదంలో.. ఫిజిక్స్వాలా
ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్వాలా వివాదంలో చిక్కుకుంది. ఆ కంపెనీకి చెందిన ముగ్గురు టీచర్లు ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో.. వాళ్లు.. బోరున విలపిస్తూ కనిపించటం చర్చనీయాంశమైంది. తమపై వచ్చిన లంచం ఆరోపణలను టీచర్లు తీవ్రంగా ఖండించారు. అవి నిరాధారమైనవని స్పష్టం చేశారు. దాంతోపాటు కంపెనీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కూడా వాళ్లు వెల్లడించారు. తాము 5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని, ఫిజిక్స్వాలా సంస్థలో బోధన మరియు అభ్యసనకు సంబంధించి సరైన వాతావరణం లేదని, అందుకే తాము ఉద్యోగం మానేశామని చెప్పినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని అన్నారు.
తాజావార్తలు
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో