World leaders: ఒడిశా రైళు ప్రమాదంపై ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానుల సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచంలోని పలు దేశాధినేతలతో సహా ప్రధాన మంత్రులు స్పందిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంతాపం ప్రకటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా ప్రపంచ నాయకులు తన ప్రగాఢ సంతాపన్ని వ్యక్తం చేశారు. దాదాపు 290 మందికి పైగా మరణించిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. వారి కుటుంబాలకు మరియు భారత ప్రభుత్వానికి తమ సంతాపాన్ని తెలిపారు. మూడు రైళ్లకు సంబంధించిన ఈ ప్రమాదం దేశంలోనే అత్యంత ఘోరమైనది మరియు ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. 900 మందికి పైగా గాయపడ్డారు.
Also Read : Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు చవాకులు పేల్చకండి.. చిరు వార్నింగ్
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి టెలిగ్రామ్ ద్వారా సంతాపం తెలిపారు. దయచేసి ఒడిశాలో రైలు ఢీకొన్న విషాద సంఘటనపై మా ప్రగాఢ సానుభూతిని అంగీకరించండి. ఈ విపత్తులో వారి బంధువులు మరియు సన్నిహితులను కోల్పోయిన వారి బాధను మేము పంచుకుంటున్నాము మరియు గాయపడిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము అని తెలిపాడు.
Also Read : KA Paul: వాళ్లందరు నా పార్టీలోకే.. కేఏ పాల్ హాట్ కామెంట్స్!
యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రాణాలతో బయటపడిన వారికి మరియు రెస్క్యూ ఆపరేషన్లలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారికి తన హృదయపూర్వక మద్దతును తెలిపాడు. ఒడిశాలో జరిగిన విషాద సంఘటనల వల్ల ప్రభావితమైన వారందరికీ ప్రధాన మంత్రి సునక్ అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ సునక్ తెలిపారు.
Also Read : Health: పండ్లు, కూరగాయలపై ఉండే తొక్కలు కూడా తినండి.. అవి కూడా ఆరోగ్యానికి మంచిది.!
రైలు ప్రమాదంపై జపాన్ ప్రధాని కిషిడా ప్రధాని మోడీకి సంతాప ప్రకటించారు. ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో అనేక మంది విలువైన ప్రాణాలను కోల్పోవడం.. గాయపడిన వార్తలకు నేను చాలా బాధపడ్డాను. జపాన్ ప్రభుత్వం మరియు దాని ప్రజల తరపున, వారికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
Also Read : David Warner: వార్నర్ సంచలన ప్రకటన.. 2024లో గుడ్బై
ఈ క్లిష్ట సమయంలో కెనడియన్లు భారత ప్రజలకు అండగా నిలుస్తున్నారని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు. భారతదేశంలోని ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం యొక్క చిత్రాలు మరియు నివేదికలు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కెనడా ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు.
నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని ప్రచండ కూడా స్పందించారు. ఈరోజు భారతదేశంలోని ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో డజన్ల కొద్దీ మంది ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీ, ప్రభుత్వం.. మరియు మృతుల కుటుంబాలకు ఈ దుఃఖ సమయంలో.. వారికి నా సానూభూతి తెలుపుతున్నాను అని నేపాల్ ప్రధాని ప్రచండ అన్నారు.
Also Read : Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. క్యాన్సర్ నుంచి తృటిలో భయటపడ్డ చిరు
ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భారత్ లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను అని షరీఫ్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!