World Earth Day 2024: ఈ ఏడాది ప్రపంచ ధరిత్రి దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Earth Day 2024: ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, మొక్కలకు నిలయం.. కానీ మానవులు తమ అవసరాలను తీర్చుకోవడానికి భూమికి అనేక రకాల హాని కలిగిస్తున్నారు. దీని వల్ల వరదలు, కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరెన్నో ప్రమాదాలకు కారణం కావచ్చు. భూమి, ప్రకృతి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ఎర్త్ డే జరుపుకుంటారు.
Read Also: KRMB: జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కేఆర్ఎంబీ.. నేడు బడ్జెట్పై ప్రత్యేక సమావేశం
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఎర్త్ డే ఎలా ప్రారంభమైంది?
1969లో యునెస్కో సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్కానెల్ తొలిసారిగా ఎర్త్ డే జరుపుకునే ఆలోచనను ప్రతిపాదించారు. ప్రారంభంలో, ఈ రోజును జరుపుకోవడం ఉద్దేశం భూమిని గౌరవించడమే. ఏప్రిల్ 22, 1970న మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్లో ఎర్త్ డే జరుపుకున్నారు. 1990లో, డెన్నిస్ హేస్ 141 దేశాలు పాల్గొన్న ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. 2016 సంవత్సరంలో ఎర్త్ డే వాతావరణ పరిరక్షణకు అంకితం చేయబడింది. ప్రస్తుతం, ఎర్త్ డే నెట్వర్క్ 190 దేశాలలో 20,000 మంది భాగస్వాములు, సంస్థలను కలిగి ఉంది.
ప్రపంచ ఎర్త్ డే 2024 థీమ్
ప్రతి సంవత్సరం ప్రపంచ భూమి దినోత్సవాన్ని ఒక థీమ్తో జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో దీని థీమ్ – ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్’ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం, దాని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం. 2023 సంవత్సరం థీమ్ “మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి”.
ఎర్త్ డే జరుపుకోవడానికి కారణం
ఎర్త్ డే రోజున, కాలుష్యం వల్ల కలిగే ప్రమాదం, అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సమస్యల గురించి చర్చించడానికి మిలియన్ల మంది ప్రజలు కలిసి వస్తారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల సహాయంతో పర్యావరణం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ భూమిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అవగాహన కల్పించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!