Pannun murder plot: భారత్ నుంచి జవాబుదారీతనం ఆశిస్తున్నాం.. ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య కుట్రపై అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అరెస్ట్ చేసింది. అమెరికా అధికారుల సూచన మేరకు గతేడాది నవంబర్లో అతడిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే నిందితుడికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా గడ్డపై అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.
ఇప్పటికే ఈ విషయాన్ని అత్యున్నత స్థాయిలో భారత ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేసింది. దీనిపై భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే హత్యకు కుట్ర పన్నిన వారిని బాధ్యులను చేసేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ విషయంలో భారత్లోని యూఎస్ రాయబార కార్యాలయం భారత్ నుంచి జవాబుదారీతనం ఆశిస్తున్నామని పేర్కొంది. అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూను హతమార్చేందుకు ఒక హంతకుడికి లక్ష డాలర్లను చెల్లించడానికి నిఖిల్ గుప్తా అంగీకరించాడని అమెరికా ఆరోపిస్తోంది.
Also Read
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
Read Also: India fertility rate: ఇండియాలో సంతానోత్పత్తి రేటు 6.2 నుంచి 2కి తగ్గింది.. లాన్సెట్ నివేదిక..
పన్నూ మర్డర్ కుట్ర భారత్, అమెరికాల మధ్య తీవ్ర సమస్యగా దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ బుధవారం వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒకరి ఆదేశానుసారం భారతీయ పౌరుడు అమెరికన్ పౌరుడిని చంపడానికి ప్రయత్నించినట్లు యూఎస్ న్యాయశాఖ ఆరోపించింది. రష్యాలో అలెక్సీ నావల్నీ హత్యకు సంబంధించి యూఎస్ఏ 500 మందికి పైగా వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లే , పన్నూ విషయంలో పరిశీలిస్తున్నారా అని ప్రశ్నించిన సమయంలో లూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ, ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై ఇండియాలో అనేక కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!