Womens T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్.. టీమిండియా షెడ్యూల్ ఇలా!
- నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..
- టీమిండియా షెడ్యూల్ ఇలా..
- భారత్ తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఆడనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens T20 World Cup 2024: ఈ ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లపై సిరీస్ ఓటములను చవిచూసింది, కానీ బంగ్లాదేశ్పై సిరీస్ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. జూలైలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా అయింది. దీని తర్వాత, 2024 ఆసియా కప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. అయితే ఫైనల్లో అజేయంగా నిలిచిన భారత జట్టు శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టు దుబాయ్ చేరుకుంది. ఈ సందర్బంగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, దుబాయ్కు వెళ్లే ముందు ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.., అబుదాబి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడతామనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఈసారి మెగా టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందని అన్నాడు. మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు సవాల్ విసిరే సత్తా మా జట్టుకు ఉందన్నారు. ప్రస్తుతం అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా జట్టులో ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే, యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచకప్కు వెళ్లే అత్యుత్తమ జట్టు ఇదేనని ఆమె వ్యాఖ్యానించింది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
- iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
టీ20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఆడనుంది. గత రెండు టీ20 ప్రపంచకప్లలో భారత మహిళల జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే, 2020లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ తన తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్ను ఆడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్కు చేరుకుంది, అక్కడ ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు వచ్చే టోర్నీలో ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. భారత్ మ్యాచ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Akkineni Nagarjuna: గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ.. విషయం ఇదే..!
అక్టోబర్ 4, శుక్రవారం, భారతదేశం vs న్యూజిలాండ్, దుబాయ్, 7:30 pm IST
అక్టోబర్ 6, ఆదివారం, భారతదేశం vs పాకిస్తాన్, దుబాయ్, 3:30 pm IST
అక్టోబర్ 9, బుధవారం, భారతదేశం vs శ్రీలంక, దుబాయ్, రాత్రి 7:30 IST
అక్టోబర్ 13 , ఆదివారం, భారత్ vs ఆస్ట్రేలియా, షార్జా, రాత్రి 7:30 IST
స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీ20 ప్రపంచకప్ను ప్రసారం చేస్తోంది. మొత్తం 23 ప్రపంచ కప్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని డిస్నీ+ హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో కూడా చూడవచ్చు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!