Matrimonial Fraud : తెల్లపిల్ల అనుకున్నాడు.. రూ.35లక్షలు ఇచ్చి తెల్లముఖం వేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial Fraud : ఒకప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడుతాయి అంటారు. ప్రస్తుతం మాట్రిమోనియల్ సైట్లే పెళ్లి నిశ్చయిస్తున్నాయి. చాలా మందికి వాటి ద్వారా మంచి సంబంధాలు దొరికినా.. కొంత మంది మాత్రం మోసపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. చెన్నైలోని డాక్టర్ కి అమెరికాలోని ఓ యువతి పెళ్లి పేరుతో కుచ్చుటోపి పెట్టింది. పుదుచ్చేరికి చెందిన డాక్టర్ దగ్గర నుంచి రూ.35 లక్షలు కొట్టేసింది. మొదటి పెళ్లి అచ్చి రాలేదనుకుంటే.. రెండో పెళ్లి ట్రయల్స్ లోనే బెడిసి కొట్టడంతో డాక్టర్ కంగుతిన్నాడు.
Read Also: Covid cases: దేశంలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే?
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
వివరాలలోకి వెళితే.. బాలాజీ పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. మొదటి పెళ్లి విఫలం కావడంతో అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇందుకు మాట్రిమోనియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అది చూసిన అమెరికాలోని సోమశ్రీ నాయర్ అనే యువతి బాలాజీతో కాంటాక్ట్ అయింది. బాలాజీకి అప్పటికే వివాహమై భార్యాభర్తల మధ్య గొడవలొచ్చి విడిపోయారు. వయసు 36 ఏళ్లే కావడంతో రెండో పెళ్లి చేసుకోవాలని ఇంట్లో బంధువులు బాలాజీకి సూచించారు. దీంతో రెండో పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనీలో తన పూర్తి వివరాలు నమోదు చేశాడు. దీంతో బాలాజీది హై ప్రొఫైల్ కావడంతో చాలా కాల్స్, మెసేజ్ లు వచ్చేవి. ఈ విధంగానే బాలాజీకి సోమశ్రీ పరిచయమయ్యింది. తాను అమెరికాలో డాక్టర్ చదువుకున్నానని చెప్పింది. ప్రస్తుతం సిరియాలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపింది. ఇద్దరిది ఒకే వృత్తి కావడంతో బాలాజీకి సోమశ్రీ అంటే ఇష్టం ఏర్పడింది.
Read Also: Eligibility for Marriage Scheme: మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు.. వివాహ పథకంపై తీవ్ర దుమారం
ముందు ఒకరినొకరం అర్థం చేసుకుని నచ్చితే పెళ్లి చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. అన్నట్లుగానే చాలాకాలం ఇద్దరు మాట్లాడుకున్నారు. రానురాను బాలాజీకి ఆ అమ్మాయిపై ఇష్టం పెరిగింది. మొదటి పెళ్లి వల్ల తనకు కలిగిన మానసిక క్షోభకు సోమశ్రీ మందు అని బాలాజీ బలంగా నమ్మాడు. సోమశ్రీ తనకు హఠాత్తుగా డబ్బు అవసరం వచ్చిందని బాలాజీని వివిధ దఫాలుగా రూ.35 లక్షలు అడిగినట్లు సమాచారం. ఈ డబ్బు ఆమెకు అందిన తరువాత సోమశ్రీ బాలాజీతో మాట్లాడడం తగ్గిపోయింది. ఫోన్ చేసినా.. తాను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసేది. చాలాసార్లు అలా కావడంతో బాలాజీకి అనుమానం వచ్చింది. దాంతో బాలాజీ ఆమె మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అడిగాడు. కానీ సోమశ్రీ నుంచి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న తర్వాత సోమశ్రీ బాలాజీతో పూర్తిగా మాట్లాడటం మానేసింది. మోసపోయానని గ్రహించిన బాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!