Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ అల్లర్లలో గాయపడిన వారికి సిద్ధరామయ్య సాయం చేస్తుండగా ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2లక్షల నష్టపరిహారాన్ని ఆయనపై విసిరి పడేసింది. మీరిచ్చే డబ్బులు అవసరం లేదంటూ విసిరికొట్టింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
బాగల్కోట్ జిల్లాలోని కెరూర్లో ఈ నెల 6న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యాసిన్ అనే వ్యక్తి.. ఓ వర్గానికి చెందిన యువతిని వేధిస్తున్నాడన్న విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో, యాసిన్ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. దీంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు. పోలీసులు రెండు వర్గాలకు సంబంధించిన 20 మందిని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు సిద్ధరామయ్య శుక్రవారం ఆస్పత్రికి వెళ్లారు. బాధిత నాలుగు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున 2లక్షలు అందించి బయటకు వచ్చారు.
Also Read
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
Skill Makthal: టీహబ్ వేదికగా ‘స్కిల్ మఖ్తల్’ లోగో ఆవిష్కరణ
అక్కడ గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఓ మహిళ ఆయన కారు ఎక్కుతుండగా ఆ డబ్బులను ఎస్కార్ట్ వాహనంపైకి విసిరేసింది. ‘మాకు డబ్బు అవసరం లేదు.. న్యాయం కావాలి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి హింసకు పాల్పడే దుండగులను శిక్షించాలి.. సమాజంలో శాంతి నెలకొనాలి’ అంటూ సిద్ధరామయ్య వాహనంపై డబ్బులు విసిరేసిన మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులైనా, ముస్లింలైనా అందర్ని సమానంగా చూడాలంటూ వాపోయింది. రాజకీయ నాయకుల ఓదార్పు అవసరం లేదని , ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆ మహిళ నినాదాలు చేసింది. ఏ తప్పు చేయకపోయినా.. కారణం లేకుండా తమ వారిపై దాడి చేశారని బోరుమంది. గాయపడ్డ వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని.. డబ్బు తమ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. భిక్షాటన చేసి అయినా తన కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
#Karnataka -Compensation money which was given by @siddaramaiah was thrown back at him by the family of victims. #Siddaramaih gave 2lakh rupees for the injured when visited them.
Their demand is not the money but to maintain law and order situation and arrest the culprits. pic.twitter.com/lsLcylbpXf— Siraj Noorani (@sirajnoorani) July 15, 2022
తాజావార్తలు
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
-
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!