Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ అల్లర్లలో గాయపడిన వారికి సిద్ధరామయ్య సాయం చేస్తుండగా ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2లక్షల నష్టపరిహారాన్ని ఆయనపై విసిరి పడేసింది. మీరిచ్చే డబ్బులు అవసరం లేదంటూ విసిరికొట్టింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
బాగల్కోట్ జిల్లాలోని కెరూర్లో ఈ నెల 6న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యాసిన్ అనే వ్యక్తి.. ఓ వర్గానికి చెందిన యువతిని వేధిస్తున్నాడన్న విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో, యాసిన్ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. దీంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు. పోలీసులు రెండు వర్గాలకు సంబంధించిన 20 మందిని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు సిద్ధరామయ్య శుక్రవారం ఆస్పత్రికి వెళ్లారు. బాధిత నాలుగు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున 2లక్షలు అందించి బయటకు వచ్చారు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
Skill Makthal: టీహబ్ వేదికగా ‘స్కిల్ మఖ్తల్’ లోగో ఆవిష్కరణ
అక్కడ గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఓ మహిళ ఆయన కారు ఎక్కుతుండగా ఆ డబ్బులను ఎస్కార్ట్ వాహనంపైకి విసిరేసింది. ‘మాకు డబ్బు అవసరం లేదు.. న్యాయం కావాలి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి హింసకు పాల్పడే దుండగులను శిక్షించాలి.. సమాజంలో శాంతి నెలకొనాలి’ అంటూ సిద్ధరామయ్య వాహనంపై డబ్బులు విసిరేసిన మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులైనా, ముస్లింలైనా అందర్ని సమానంగా చూడాలంటూ వాపోయింది. రాజకీయ నాయకుల ఓదార్పు అవసరం లేదని , ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆ మహిళ నినాదాలు చేసింది. ఏ తప్పు చేయకపోయినా.. కారణం లేకుండా తమ వారిపై దాడి చేశారని బోరుమంది. గాయపడ్డ వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని.. డబ్బు తమ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. భిక్షాటన చేసి అయినా తన కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
#Karnataka -Compensation money which was given by @siddaramaiah was thrown back at him by the family of victims. #Siddaramaih gave 2lakh rupees for the injured when visited them.
Their demand is not the money but to maintain law and order situation and arrest the culprits. pic.twitter.com/lsLcylbpXf— Siraj Noorani (@sirajnoorani) July 15, 2022
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!