Uttarpradesh: ఉత్తరప్రదేశ్ మధురలోని యమునా ఎక్స్ప్రెస్వే సమీపంలో ట్రాలీ లగేజీలో పాలిథిన్లో చుట్టి ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. హత్యకు గురైన మహిళకు ఇరవై ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె ముఖంపై రక్తం ఉందని వారు తెలిపారు. ఆమె శరీరం అంతటా గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Uttarakhand: 700 మీటర్ల లోయలో పడిపోయిన వాహనం.. 12 మంది మృతి
హంతకుడు లేదా హంతకులు ఆమెను వేరే చోట చంపి, రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా లేని ఎక్స్ప్రెస్వే దగ్గర ఆమె మృతదేహాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కూలీలు సూట్కేస్ను చూసి పోలీసులకు ఫోన్ చేశారు, వారు వచ్చిన తర్వాత దానిని తెరిచి మృతదేహాన్ని కనుగొన్నారు. సూట్కేస్ దొరికిన ప్రదేశానికి వచ్చిన పోలీసు అధికారి మహావన్ అలోక్ సింగ్, ఫోరెన్సిక్ బృందం సాధ్యమైన ఆధారాలను సేకరించిందని చెప్పారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ మృతదేహం వివరాల గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.