DK Shiva Kumar: అవినీతి ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shiva Kumar: కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు. “నేను ఎవరి దగ్గర కమీషన్ తీసుకున్నా ఈరోజే రాజకీయాల నుంచి రిటైర్ అవుతాను. కానీ బొమ్మై, అశోక్ (ఆరోపణలు) తప్పని నిరూపిస్తే రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా?” అని శివకుమార్ అన్నారు. తాను వారు ఉన్న స్థానాన్ని, సీనియారిటీని గౌరవిస్తానని, అశోక్ ఏం మాట్లాడారో తనకు బాగా తెలుసన్నారు. తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని డీకే. శివకుమార్ చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులపై మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై , ఆర్. అశోక్ తో సహా ప్రతిపక్ష నేతలు తన గురించి మాట్లాడుతున్నారని, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ బిల్లు ఎందుకు చెల్లించలేదు? అని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
Also Read: Adani Ports: మేనేజ్మెంట్తో విభేదాలు.. అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి డెలాయిట్ రాజీనామా
Also Read
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కొందరు ఫిర్యాదులు చేశారని, అసలు పనులు జరిగాయో లేదో పరిశీలించడానికి అవకాశం ఇవ్వాలి కదా, కాంట్రాక్టు పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కూడా సభను అభ్యర్థించారు. అందుకే విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, పనులు పూర్తయ్యాయో లేదో పరిశీలించాలని కమిటీని ఆదేశించామని డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న శివకుమార్.. గతంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికే చేపట్టిన వివిధ పనులపై దర్యాప్తు ఒక శాఖ మాత్రమే కాకుండా అన్ని అంశాలను కవర్ చేస్తుందన్నారు.
Also Read: Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే (మెట్రోపాలిటన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్)లో తీవ్ర అవినీతికి పాల్పడుతోందని బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంట్రాక్టర్ల సంఘం గవర్నర్ వద్దకు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చిందని, రాహుల్గాంధీకి ట్వీట్ ద్వారా తెలపడంతో పాటు తమను కూడా కలిశారని, కాబట్టి ఈ సమస్యపై పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ‘లోతైన, బహిరంగ అవినీతి జరుగుతోంది. గత మూడు నెలలుగా కాంట్రాక్టర్లకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు. వారు కొన్ని విచారణలను (చెల్లింపులు నిలిచిపోవడానికి) కారణంగా చూపుతున్నారు. వారు విచారణ చేయనివ్వండి. మేము వారిని ఆపడం లేదు. విచారణ జరిపి దోషులను ఉరి తీయనివ్వండి, అయితే గత ఆరు నెలలుగా పనిచేసిన నిజమైన వ్యక్తులకు చెల్లింపులు జరగడం లేదు, ”అని బొమ్మై అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.650 కోట్ల చెల్లింపును విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బీబీఎంపీ వసూలు చేసే ఆస్తిపన్నును పనులను యథార్థంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలని బొమ్మై అన్నారు.
తాజావార్తలు
-
India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
-
Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
-
Ragi Punugulu – Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!