DK Shiva Kumar: అవినీతి ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shiva Kumar: కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు. “నేను ఎవరి దగ్గర కమీషన్ తీసుకున్నా ఈరోజే రాజకీయాల నుంచి రిటైర్ అవుతాను. కానీ బొమ్మై, అశోక్ (ఆరోపణలు) తప్పని నిరూపిస్తే రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా?” అని శివకుమార్ అన్నారు. తాను వారు ఉన్న స్థానాన్ని, సీనియారిటీని గౌరవిస్తానని, అశోక్ ఏం మాట్లాడారో తనకు బాగా తెలుసన్నారు. తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని డీకే. శివకుమార్ చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులపై మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై , ఆర్. అశోక్ తో సహా ప్రతిపక్ష నేతలు తన గురించి మాట్లాడుతున్నారని, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ బిల్లు ఎందుకు చెల్లించలేదు? అని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
Also Read: Adani Ports: మేనేజ్మెంట్తో విభేదాలు.. అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి డెలాయిట్ రాజీనామా
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కొందరు ఫిర్యాదులు చేశారని, అసలు పనులు జరిగాయో లేదో పరిశీలించడానికి అవకాశం ఇవ్వాలి కదా, కాంట్రాక్టు పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కూడా సభను అభ్యర్థించారు. అందుకే విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, పనులు పూర్తయ్యాయో లేదో పరిశీలించాలని కమిటీని ఆదేశించామని డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న శివకుమార్.. గతంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికే చేపట్టిన వివిధ పనులపై దర్యాప్తు ఒక శాఖ మాత్రమే కాకుండా అన్ని అంశాలను కవర్ చేస్తుందన్నారు.
Also Read: Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే (మెట్రోపాలిటన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్)లో తీవ్ర అవినీతికి పాల్పడుతోందని బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంట్రాక్టర్ల సంఘం గవర్నర్ వద్దకు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చిందని, రాహుల్గాంధీకి ట్వీట్ ద్వారా తెలపడంతో పాటు తమను కూడా కలిశారని, కాబట్టి ఈ సమస్యపై పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ‘లోతైన, బహిరంగ అవినీతి జరుగుతోంది. గత మూడు నెలలుగా కాంట్రాక్టర్లకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు. వారు కొన్ని విచారణలను (చెల్లింపులు నిలిచిపోవడానికి) కారణంగా చూపుతున్నారు. వారు విచారణ చేయనివ్వండి. మేము వారిని ఆపడం లేదు. విచారణ జరిపి దోషులను ఉరి తీయనివ్వండి, అయితే గత ఆరు నెలలుగా పనిచేసిన నిజమైన వ్యక్తులకు చెల్లింపులు జరగడం లేదు, ”అని బొమ్మై అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.650 కోట్ల చెల్లింపును విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బీబీఎంపీ వసూలు చేసే ఆస్తిపన్నును పనులను యథార్థంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలని బొమ్మై అన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!