DK Shiva Kumar: అవినీతి ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shiva Kumar: కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు. “నేను ఎవరి దగ్గర కమీషన్ తీసుకున్నా ఈరోజే రాజకీయాల నుంచి రిటైర్ అవుతాను. కానీ బొమ్మై, అశోక్ (ఆరోపణలు) తప్పని నిరూపిస్తే రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా?” అని శివకుమార్ అన్నారు. తాను వారు ఉన్న స్థానాన్ని, సీనియారిటీని గౌరవిస్తానని, అశోక్ ఏం మాట్లాడారో తనకు బాగా తెలుసన్నారు. తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని డీకే. శివకుమార్ చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులపై మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై , ఆర్. అశోక్ తో సహా ప్రతిపక్ష నేతలు తన గురించి మాట్లాడుతున్నారని, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ బిల్లు ఎందుకు చెల్లించలేదు? అని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
Also Read: Adani Ports: మేనేజ్మెంట్తో విభేదాలు.. అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి డెలాయిట్ రాజీనామా
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కొందరు ఫిర్యాదులు చేశారని, అసలు పనులు జరిగాయో లేదో పరిశీలించడానికి అవకాశం ఇవ్వాలి కదా, కాంట్రాక్టు పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కూడా సభను అభ్యర్థించారు. అందుకే విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, పనులు పూర్తయ్యాయో లేదో పరిశీలించాలని కమిటీని ఆదేశించామని డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న శివకుమార్.. గతంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికే చేపట్టిన వివిధ పనులపై దర్యాప్తు ఒక శాఖ మాత్రమే కాకుండా అన్ని అంశాలను కవర్ చేస్తుందన్నారు.
Also Read: Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే (మెట్రోపాలిటన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్)లో తీవ్ర అవినీతికి పాల్పడుతోందని బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంట్రాక్టర్ల సంఘం గవర్నర్ వద్దకు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చిందని, రాహుల్గాంధీకి ట్వీట్ ద్వారా తెలపడంతో పాటు తమను కూడా కలిశారని, కాబట్టి ఈ సమస్యపై పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ‘లోతైన, బహిరంగ అవినీతి జరుగుతోంది. గత మూడు నెలలుగా కాంట్రాక్టర్లకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు. వారు కొన్ని విచారణలను (చెల్లింపులు నిలిచిపోవడానికి) కారణంగా చూపుతున్నారు. వారు విచారణ చేయనివ్వండి. మేము వారిని ఆపడం లేదు. విచారణ జరిపి దోషులను ఉరి తీయనివ్వండి, అయితే గత ఆరు నెలలుగా పనిచేసిన నిజమైన వ్యక్తులకు చెల్లింపులు జరగడం లేదు, ”అని బొమ్మై అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.650 కోట్ల చెల్లింపును విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బీబీఎంపీ వసూలు చేసే ఆస్తిపన్నును పనులను యథార్థంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలని బొమ్మై అన్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!