One Nation One Election: దేశంలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ సాధ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Nation One Election: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే చర్చ దేశంలో జోరందుకుంది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలు వస్తే ఓటరు ఐదేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే పోలింగ్ బూత్కు వెళ్తారు. ఒకేసారి స్థానిక, అసెంబ్లీ, లోక్సభ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పాలనే ప్రధాన కేంద్ర బిందువుగా మారే ఈ ప్రక్రియతో ఎన్నికల ఖర్చులు, ఎన్నికల కోడ్లు లేకుండా ఎన్నికైన అన్ని విభాగాలు ఐదేళ్లపాటు సరిగా పాలనపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని వీటికి మద్దతు పలికే వారు వాదిస్తున్నారు. ఒకవేళ అన్ని ఎన్నికలు ఒకేసారి జరపాల్సి వస్తే వచ్చే సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరగాలని వారు సూచిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా వీటి సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మాజీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక కోణంలో అది మెరుగ్గా ఉంటుందని, మరోవైపు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
Also Read: Bussiness Tips : కేవలం రూ.20 పెట్టుబడి పెడితే చాలు.. రూ.5 లక్షలు పొందవచ్చు..
Also Read
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా అనుకూలంగా ఉండగా, ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దీనిపై తమ భిన్నమైన వైఖరిని కలిగి ఉన్నారు. అయితే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ కూడా వన్ నేషన్, వన్ ఎలక్షన్పై తన స్టాండ్ను ముందుకు తెచ్చారు. దాని ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి చెప్పారు. ఆయన ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’కు ఇబ్బంది ఉంది. అంటే రాజ్యాంగం, చట్టాన్ని సవరించడం, పార్లమెంటు ద్వారా ఆ సవరణలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఒక దేశం, ఒకే ఎన్నికలు సాధ్యమా?
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో 1951-1952లో తొలిసారిగా జరిగిన సాధారణ ఎన్నికలు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జరిగాయని, తర్వాత 1957, 1962, 1967ల్లోనూ ఒకేసారి ఎన్నికలు జరిగాయన్నారు. అయితే 1968-69 మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం కారణంగా ఒకేసారి ఎన్నిక విధానానికి ఆటంకం ఏర్పడిందన్నారు. తర్వాత 1970 జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి కాలపరిమితి ముగియకుండానే లోక్సభ రద్దు అయ్యిందని.. ఆ సమయంలో నాలుగో లోక్సభ మూడు సంవత్సరాల పదినెలలు మాత్రమే కొనసాగిందన్నారు. దీనిని మెరుగుపరచాలని.. మరోసారి ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ నిర్వహించవచ్చని’ ఎన్నికల కమిషనర్ 1982-83లో భారత ప్రభుత్వానికి సూచించారని, అయితే ఆ సమయంలో కమిషన్ సూచనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. దీని తర్వాత 2015లో భారత ప్రభుత్వం ఒక దేశం, ఒకే ఎన్నికలు సాధ్యమా కాదా అని సూచించమని ఎన్నికల కమిషన్ను కోరిందన్నారు. అప్పుడు కమిషన్ అది సాధ్యమేనని చెప్పిందని, అయితే దీని కోసం రాజ్యాంగంలో కొన్ని సవరణలు ఉంటాయని తెలిపిందన్నారు.
Also Read: Oxygen-28: ఆక్సిజన్ కొత్త రూపాన్ని కనుగొన్న సైంటిస్టులు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
సవాలుతో కూడుకున్న పని
అనేక చట్టాలను సవరించాలని భారత ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సూచించిందని ఓపీ రావత్ తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1981లో సవరణలు, సరిపడా ఈవీఎంలను కొనుగోలు చేసేందుకు డబ్బు, తగిన సంఖ్యలో పారా మిలటరీ బలగాలు ఉంటేనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ సాధ్యమేనా అని మాజీ చీఫ్ కమిషనర్ను ప్రశ్నించగా.. అది సాధ్యమేనని ఆయన సమాధానమిచ్చారు. అయితే దీని కోసం రాజ్యాంగం, చట్టంలో మార్పులు చేయడం సవాలుతో కూడుకున్న పని. ఈ సవరణలను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనికి అన్ని పార్టీల సమ్మతి ఉండాలన్నారు. ఈ చట్టాలను ఏకగ్రీవంగా మార్చే వరకు ఎన్నికల సంఘానికి కట్టుబడి ఉండాలని, అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయలేమని అన్నారు. సవరణలు చేస్తే ఆ తర్వాత కమిషన్తో చర్చించి ఈవీఎంల కొరతను తొలగించి డబ్బులు చెల్లించాలన్నారు. అంతా ప్లాన్ ప్రకారం జరిగినా.. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో కొంత సమయం పడుతుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎలా పరిష్కరిస్తారంటూ మీడియా ప్రశ్నించగా.. దానికి ఓపీ రావత్ బదులిస్తూ.. ఎన్నికల సంఘం, లా కమిషన్, నీతి ఆయోగ్ దీనికి సూచనలు చేశాయని.. రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయంతో సాధ్యమైతే ఇది పూర్తవుతుందన్నారు.
ఒక కోణంలో ప్రయోజనమే..
ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రయోజనాల గురించి కూడా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వివరించారు. ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవడానికి నిర్దిష్ట దర్యాప్తు జరగలేదన్నారు. కానీ ఇది ఒక కోణం నుంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఏటా ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వం, నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. శాంతిభద్రతల కారణంగా పరిపాలన కూడా చెదిరిపోవాల్సి వస్తోంది. అదే సమయంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ మొదలైతే.. ఇది నాయకులకు సహాయం చేస్తుంది. పని చేయడానికి, ప్రజా సమస్యలపై శ్రద్ధ వహించడానికి సమయం ఉంటుందని ఓపీ రావత్ తెలిపారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే అంశంపై మాజీ న్యాయ కార్యదర్శి పికె మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే పద్ధతిలో వరుసగా నాలుగు ఎన్నికలు జరిగాయని, ఎలాంటి సమస్య లేదని మన ప్రధాని కూడా అప్పుడప్పుడు చెబుతూ వస్తున్నారని, ఇప్పుడు ఆ సమయం వచ్చిందని అన్నారు.
మరో సారి తెరపైకి..
1999లో జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన లా కమిషన్ కూడా లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీల స్థానాలకు ఎన్నికలు జరపాలని తన నివేదికలో అభిప్రాయపడింది. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాలను నివేదించింది. మొదట్లో ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడు.. లోక్సభ, శాసనసభలకు కలిపి ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ ప్రారంభమైంది. తరువాత అది మరుగునపడిపోయింది. కానీ, 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలి ఎన్నికలు మరోసారి తెరపైకి వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్టీలు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొన్ని పార్టీలు జమిలి ఎన్నికల ఆలోచన అసాధ్యమని వ్యతిరేకించాయి. ఈ నెలలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దేశంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై ఏం నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!