Husband K*illed: పెళ్లికి ముందే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమ.. ఇష్టం లేని వివాహం చేసుకుని భర్తను..
- పెళ్లికి ముందే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమ
- ఇష్టం లేని వివాహం
- భార్య తన ప్రియుడైన ఉపాధ్యాయుడి సహాయంతో భర్తను హత్య చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని బలోత్రాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్వా గ్రామంలో, ఓ భార్య తన ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు నిందితులైన భార్య, ప్రియుడు ఇద్దరినీ అరెస్టు చేశారు. అసలు విషయం ఏమిటంటే, మూడేళ్ల క్రితం, మాల్వా గోయలన్లోని మేఘ్వాల్ నివాసి, పెమారం కుమారుడైన మృతుడు మహేంద్ర కుమార్ (21)కు, బగుండి నివాసి అయిన అను దేవితో వివాహం జరిగింది. ఈ పెళ్లి అను దేవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. భార్య చాలా వరకు తన పుట్టింట్లోనే ఉండేది.
Also Read:Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్
Also Read
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
పెళ్లికి ముందు అనుదేవి తిలవారాకు చెందిన చెనారామ్ మేఘ్వాల్ కుమారుడైన అమరారామ్ అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఆ తర్వాత ప్రేమించుకున్నారు. అమరారామ్ చిడియా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంటాడు. అను, ఆ ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత, అనుకి, ఆమె భర్తకి మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. దానిపై చాలాసార్లు పంచాయతీలు కూడా జరిగాయి. పంచాయతీల తర్వాత అను తన అత్తగారింటికి వచ్చింది, కానీ అక్కడికి వచ్చిన రెండు రోజులకే ఆమె తన ప్రియుడు అమరారామ్కి ఫోన్ చేసింది.
Also Read:Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్చల్.. ఒకరి బలి
ప్రియుడిని పిలిపించుకుని గాఢ నిద్రలో ఉన్న మహేంద్రను గొంతు నులిమి చంపేశారు. ఉదయం మహేంద్ర నిద్ర లేవకపోవడంతో తల్లి గదిలోకి వెళ్లిచూసింది. అచేతనంగా మహేంద్ర పడి ఉండడం, శరీరం, మెడపై గీతలు ఉండటాన్ని గమనించిన ఆమెకు అనుమానం కలిగింది. అప్పుడు మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఉపాధ్యాయుడు అమరారామ్ను, మృతుడి భార్య అనును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా ఇద్దరూ మహేంద్రను గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!