Husband K*illed: పెళ్లికి ముందే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమ.. ఇష్టం లేని వివాహం చేసుకుని భర్తను..
- పెళ్లికి ముందే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమ
- ఇష్టం లేని వివాహం
- భార్య తన ప్రియుడైన ఉపాధ్యాయుడి సహాయంతో భర్తను హత్య చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని బలోత్రాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్వా గ్రామంలో, ఓ భార్య తన ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు నిందితులైన భార్య, ప్రియుడు ఇద్దరినీ అరెస్టు చేశారు. అసలు విషయం ఏమిటంటే, మూడేళ్ల క్రితం, మాల్వా గోయలన్లోని మేఘ్వాల్ నివాసి, పెమారం కుమారుడైన మృతుడు మహేంద్ర కుమార్ (21)కు, బగుండి నివాసి అయిన అను దేవితో వివాహం జరిగింది. ఈ పెళ్లి అను దేవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. భార్య చాలా వరకు తన పుట్టింట్లోనే ఉండేది.
Also Read:Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
పెళ్లికి ముందు అనుదేవి తిలవారాకు చెందిన చెనారామ్ మేఘ్వాల్ కుమారుడైన అమరారామ్ అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఆ తర్వాత ప్రేమించుకున్నారు. అమరారామ్ చిడియా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంటాడు. అను, ఆ ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత, అనుకి, ఆమె భర్తకి మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. దానిపై చాలాసార్లు పంచాయతీలు కూడా జరిగాయి. పంచాయతీల తర్వాత అను తన అత్తగారింటికి వచ్చింది, కానీ అక్కడికి వచ్చిన రెండు రోజులకే ఆమె తన ప్రియుడు అమరారామ్కి ఫోన్ చేసింది.
Also Read:Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్చల్.. ఒకరి బలి
ప్రియుడిని పిలిపించుకుని గాఢ నిద్రలో ఉన్న మహేంద్రను గొంతు నులిమి చంపేశారు. ఉదయం మహేంద్ర నిద్ర లేవకపోవడంతో తల్లి గదిలోకి వెళ్లిచూసింది. అచేతనంగా మహేంద్ర పడి ఉండడం, శరీరం, మెడపై గీతలు ఉండటాన్ని గమనించిన ఆమెకు అనుమానం కలిగింది. అప్పుడు మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఉపాధ్యాయుడు అమరారామ్ను, మృతుడి భార్య అనును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా ఇద్దరూ మహేంద్రను గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!