Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. మార్చి 28న తొలి మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి పోరు జగరనుంది. ఈ నేపథ్యంలో టీమిండి, కేకేఆర్ మాజీ స్టార్ హైదరాబాద్ టీమ్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కమిన్స్ లేకపోవడం, ఓ ప్రధాన విదేశీ పేసర్ లేకుండానే మ్యాచ్ ప్రారంభించడంపై విశ్లేషణ చేశాడు. SRH టీమ్లో బెస్ట్ బౌలర్లు లేరని ఎద్దేవా చేశారు. బ్యాటర్లు కష్టపడి 250 కొట్టినా బౌలర్లు ఈ మ్యాచ్ను ఓడగొడతారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. ఎంత కొట్టినా ఓడిపోతారని అభిప్రాయపడ్డాడు.
READ MORE: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!
Also Read
- డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
- Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
కేకేఆర్ మాజీ స్టార్ ఆకాశ్ చోప్రా హైదరాబాద్ జట్టు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడం, జాక్ ఎడ్వర్డ్స్ సీజన్ మొత్తానికి దూరం కావడం ఎస్ఆర్హెచ్కు పెద్ద దెబ్బ అని అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టు బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. ఒకవేళ బ్యాటర్లు రాణించి 250 పరుగులు చేసినా, ఆ పరుగులను కాపాడుకునే శక్తి ఈ బౌలర్లకు ఉందా? అనేది అనుమానమే. వారు 250 కొట్టినా, ప్రత్యర్థికి కూడా అన్ని పరుగులు సమర్పించుకునేలా ఉన్నారు” అని తీవ్రంగా విమర్శించాడు. విదేశీ పేసర్ ఈషాన్ మలింగ ఫిట్నెస్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తుండటంతో, జట్టులో సరైన విదేశీ ఫాస్ట్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి వంటి భారతీయ బౌలర్లు ఉన్నప్పటికీ, నాణ్యమైన విదేశీ పేసర్ లేకపోవడం వల్ల బ్రైడన్ కార్స్ వంటి వారిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించాడు. రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయపడటం మేనేజ్మెంట్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
-
Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!