Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. మార్చి 28న తొలి మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి పోరు జగరనుంది. ఈ నేపథ్యంలో టీమిండి, కేకేఆర్ మాజీ స్టార్ హైదరాబాద్ టీమ్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కమిన్స్ లేకపోవడం, ఓ ప్రధాన విదేశీ పేసర్ లేకుండానే మ్యాచ్ ప్రారంభించడంపై విశ్లేషణ చేశాడు. SRH టీమ్లో బెస్ట్ బౌలర్లు లేరని ఎద్దేవా చేశారు. బ్యాటర్లు కష్టపడి 250 కొట్టినా బౌలర్లు ఈ మ్యాచ్ను ఓడగొడతారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. ఎంత కొట్టినా ఓడిపోతారని అభిప్రాయపడ్డాడు.
READ MORE: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!
Also Read
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
కేకేఆర్ మాజీ స్టార్ ఆకాశ్ చోప్రా హైదరాబాద్ జట్టు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడం, జాక్ ఎడ్వర్డ్స్ సీజన్ మొత్తానికి దూరం కావడం ఎస్ఆర్హెచ్కు పెద్ద దెబ్బ అని అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టు బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. ఒకవేళ బ్యాటర్లు రాణించి 250 పరుగులు చేసినా, ఆ పరుగులను కాపాడుకునే శక్తి ఈ బౌలర్లకు ఉందా? అనేది అనుమానమే. వారు 250 కొట్టినా, ప్రత్యర్థికి కూడా అన్ని పరుగులు సమర్పించుకునేలా ఉన్నారు” అని తీవ్రంగా విమర్శించాడు. విదేశీ పేసర్ ఈషాన్ మలింగ ఫిట్నెస్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తుండటంతో, జట్టులో సరైన విదేశీ ఫాస్ట్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి వంటి భారతీయ బౌలర్లు ఉన్నప్పటికీ, నాణ్యమైన విదేశీ పేసర్ లేకపోవడం వల్ల బ్రైడన్ కార్స్ వంటి వారిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించాడు. రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయపడటం మేనేజ్మెంట్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?