Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్చల్.. ఒకరి బలి
- మద్యం మత్తులో పోకిరీల హల్చల్
- కారుతో బీభత్సం సృష్టించిన కంత్రీగాళ్లు
- రోడ్డుపై ఆగమాగం చేసిన యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం మత్తులో స్టీరింగ్ పట్టిన నలుగురు యువకులు ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టారు. రాజమండ్రిలో అర్ధరాత్రి రోడ్లపై రేసింగ్ చేస్తూ పలుచోట్ల ప్రమాదాలు చేశారు పోకిరీ యువకులు. చివరికి వారి నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో షికారు చేస్తూ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కారులో నలుగురు యువకులు.. పీకలదాకా మద్యం తాగారు.. అర్ధరాత్రి షికారుకు బయల్దేరారు. అసలే మద్యం మత్తు..పైగా హైస్పీడ్తో రోడ్డుపై బీభత్సం సృష్టించారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పలు ప్రమాదాలు చేశారు కారులోని యువకులు.
Also Read
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో… ధవళేశ్వరానికి చెందిన వాసు అనే 45 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
కేసులో నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అంతకు ముందే ఓ తోపుడు బండిని కూడా ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
రోడ్డుపై పోకిరీలు చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!