Madhya Pradesh : లవ్ మ్యారేజ్ చేసుకుంది.. మరో లవర్ దొరకగానే ‘మాజీ’ని మట్టుపెట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భార్యాభర్తల మధ్య బంధానికి మచ్చ తెచ్చే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి భర్త అడ్డుగా మారడంతో భార్య భర్తను చంపిన ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే మరణానికి ముందు భర్త తన భార్య అక్రమ సంబంధాన్ని కనుగొన్నాడు. మొబైల్ ఫోన్లోని వీడియో కారణంగా భార్య పన్నాగం బట్టబయలైంది. భార్య, ఆమె ప్రేమికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సలీహా పర్వీన్, బంటు ఖాన్లుగా గుర్తించారు.
Read Also: Odisha: హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు..
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
షాహిద్ ఖాన్, సలీహా ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా సలీహాను షాహిద్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి దాంపత్యం సజావుగానే సాగింది. అయితే కొద్దిరోజుల తర్వాత బంటు ఖాన్తో సలీహా అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో షాహిద్ను తన దారికి తెచ్చుకోవాలని సలీహా భావించింది. నెలరోజుల నుంచి షాహిద్ను హత్య చేయాలని సలీహా ప్లాన్ చేస్తోంది. ఎట్టకేలకు తన ప్లాన్ అమలు చేసింది. తన భర్త అయిన షాహిద్కు టీలో విషం కలిపి ఇచ్చింది. టీ తాగిన తర్వాత షాహిద్ విషం కలిపిన విషయాన్ని గ్రహించాడు.. దాంతో తనకు బతికే అవకాశం లేదని తెలుసుకుంటాడు. వెంటనే తన మొబైల్ ఫోన్లో వీడియో తీసి తన భార్య చేసిన దారుణాన్ని చిత్రీకరించాడు. తన చావుకు భార్య సలీహా, ఆమె ప్రేమికుడు బంటు, అత్తగారే కారణమని ఆరోపించారు. టీ తాగిన తర్వాత షాహిద్ ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also:Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం
కుమారుడి మృతి వార్త తెలిసిన వెంటనే షాహిద్ తండ్రి ఆస్పత్రికి చేరుకున్నారు. షాహిద్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కొడుకు చనిపోవడంతో, తండ్రి అతని మొబైల్ ఫోన్ను తనిఖీ చేశాడు. ఈ సమయంలో వారికి మొబైల్ ఫోన్లో ఓ వీడియో దొరికింది. ఈ వీడియోలో షాహిద్ తన చావుకు తన భార్యే కారణమని చెబుతున్నాడు. తన భార్య టీలో విషం కలిపిందని కూడా చెప్పాడు. షాహిద్ తండ్రి ఆ వీడియోను పోలీసులకు చూపించి కోడలిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించగా వారు నేరం అంగీకరించారు.
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!