Madhya Pradesh : లవ్ మ్యారేజ్ చేసుకుంది.. మరో లవర్ దొరకగానే ‘మాజీ’ని మట్టుపెట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భార్యాభర్తల మధ్య బంధానికి మచ్చ తెచ్చే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి భర్త అడ్డుగా మారడంతో భార్య భర్తను చంపిన ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే మరణానికి ముందు భర్త తన భార్య అక్రమ సంబంధాన్ని కనుగొన్నాడు. మొబైల్ ఫోన్లోని వీడియో కారణంగా భార్య పన్నాగం బట్టబయలైంది. భార్య, ఆమె ప్రేమికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సలీహా పర్వీన్, బంటు ఖాన్లుగా గుర్తించారు.
Read Also: Odisha: హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు..
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
షాహిద్ ఖాన్, సలీహా ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా సలీహాను షాహిద్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి దాంపత్యం సజావుగానే సాగింది. అయితే కొద్దిరోజుల తర్వాత బంటు ఖాన్తో సలీహా అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో షాహిద్ను తన దారికి తెచ్చుకోవాలని సలీహా భావించింది. నెలరోజుల నుంచి షాహిద్ను హత్య చేయాలని సలీహా ప్లాన్ చేస్తోంది. ఎట్టకేలకు తన ప్లాన్ అమలు చేసింది. తన భర్త అయిన షాహిద్కు టీలో విషం కలిపి ఇచ్చింది. టీ తాగిన తర్వాత షాహిద్ విషం కలిపిన విషయాన్ని గ్రహించాడు.. దాంతో తనకు బతికే అవకాశం లేదని తెలుసుకుంటాడు. వెంటనే తన మొబైల్ ఫోన్లో వీడియో తీసి తన భార్య చేసిన దారుణాన్ని చిత్రీకరించాడు. తన చావుకు భార్య సలీహా, ఆమె ప్రేమికుడు బంటు, అత్తగారే కారణమని ఆరోపించారు. టీ తాగిన తర్వాత షాహిద్ ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also:Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం
కుమారుడి మృతి వార్త తెలిసిన వెంటనే షాహిద్ తండ్రి ఆస్పత్రికి చేరుకున్నారు. షాహిద్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కొడుకు చనిపోవడంతో, తండ్రి అతని మొబైల్ ఫోన్ను తనిఖీ చేశాడు. ఈ సమయంలో వారికి మొబైల్ ఫోన్లో ఓ వీడియో దొరికింది. ఈ వీడియోలో షాహిద్ తన చావుకు తన భార్యే కారణమని చెబుతున్నాడు. తన భార్య టీలో విషం కలిపిందని కూడా చెప్పాడు. షాహిద్ తండ్రి ఆ వీడియోను పోలీసులకు చూపించి కోడలిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించగా వారు నేరం అంగీకరించారు.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!