Wife Killed Husband: అతనేం చేశాడని పెళ్లిరోజే పైకి పంపావు తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband: ప్రతి జంట జీవితంలో పెళ్లిరోజు ముఖ్యమైనది. ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకునేందుకు జంటలు ఉత్సాహం చూపిస్తారు. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మహిళ తన వివాహ వార్షికోత్సవాన్ని కూడా అపూర్వంగా గుర్తుండిపోయేలా చేసింది. ఓ మహిళ తన పెళ్లిరోజు సందర్భంగా భర్తను హత్య చేసింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. కేవలం 24 గంటల్లోనే హత్యను ఛేదించిన పోలీసులు.. భార్యతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, రక్తంతో తడిసిన దుస్తులు, బూట్లు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హత్య చేసేందుకు సుపారీ ఇచ్చేందుకు ఆ మహిళ తన నగలను విక్రయించింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు సైతం షాక్కు గురయ్యారు.
Read Also:Diwali Holiday in US: అమెరికాలో ఫెడరల్ హాలీడేగా దీపావళి!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
వివరాల్లోకి వెళితే.. జగ్జీవన్ రామ్ రాత్రే , ధనేశ్వరి ఇద్దరు భార్యభర్తలు. భర్త జగ్జీవన్ భార్య ధనేశ్వరిని రోజూ చిత్రహింసలు పెట్టేవాడు. పెళ్లయినప్పటి నుంచి భర్త నిత్యం మద్యం సేవించి కొట్టేవాడు. ఈ వేధింపులతో విసిగి వేసారిన ఆ మహిళ తన భర్తను శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తనకు పరిచయమైన తుషార్ సోనీ అలియాస్ గోపీని సంప్రదించింది. ఆపై ఆమె తన భర్త జగ్జీవన్రామ్ రాత్రేను హత్యకు రప్పించింది. నగలు అమ్మి హత్యచేసేందుకు నిందితులకు అడ్వాన్స్గా రూ.50 వేలు కూడా ఇచ్చింది.
Read Also:Wrestlers Protest: రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన రామ్ దేవ్ బాబా
కోర్బా వద్ద సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. సైబర్ సెల్, ఫోరెన్సిక్ నిపుణుడు బిలాస్పూర్, డాగ్ టీమ్తో పోలీసు బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. జగ్జీవన్ రామ్ రాత్రే భార్య ధనేశ్వరి రాత్రేను విచారించారు. అయితే ఆమె పదే పదే తన వాంగ్మూలాన్ని మార్చి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు క్షుణ్ణంగా విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. తన భర్త కష్టాలతో విసిగి వేసారిన ఆమె కాళ్లను తీసేసిందని పోలీసులు విచారణలో తెలిపారు. అనంతరం భార్యతో పాటు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!