Killer Wife: ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చేందుకు భార్య కుట్ర.. చివరకు
- ప్రయివేట్ చిట్టీలు వేస్తున్న పద్మ భర్త రాజు
- నిత్యం సందీప్ ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసిన పద్మ
- వివాహేతర సంబంధం గురించి తెలిసి మందలించిన రాజు
- సుపారీ డబ్బు ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్
- సందీప్కు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ సహకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డామిట్ కథ అడ్డం తిరిగింది. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చేందుకు భార్య పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ప్రియున్ని అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన వరంగల్లో వెలుగులోకి వచ్చింది. వరంగల్లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనేవ్యక్తిపై ఆగస్టు 14న రాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని పోతననగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి దాడి చేశారు. అతను చనిపోయాడనుకొని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని హాస్పిటల్కి తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది.
Also Read:Kakinada: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో విషాదం.. కుప్పకూలి యువకుడు మృతి
Also Read
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఈ సంఘటన వరంగల్ రామన్నపేటలోని రఘునాథ్ కాలనీలో జరిగింది. గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడేనికి చెందిన పోతుల సందీప్తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో ప్రియుడు సందీప్కు తన భర్త రాజుతో స్నేహం చేసి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది.
పద్మ భర్త రాజు.. ప్రయివేట్ చిట్టీలు వేసేవాడు. సందీప్తో తన భర్త వద్ద చిట్టీలు వేయించిన పద్మ నిత్యం సందీప్ తన ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసింది. రాజు ఇంట్లోలేని సమయంలో కూడా సందీప్ తరచుగా వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. ఇరుగు పొరుగు వారి ద్వారా రాజు చెవిన పడింది. దీంతో భార్యను మందలించాడు రాజు. ఈ క్రమంలో హైరానా పడిపోయిన భార్య పద్మ, ప్రియుడు సందీప్తో కలిసిభర్త హత్యకు స్కెచ్ వేసింది. ప్రియుడికి కొంత డబ్బు సుపారీగా ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది. దీంతో తన స్నేహితులతో కలిసి ప్రియుడు సందీప్ ఆగస్ట్ 14న రాజుపై దాడికి పాల్పడ్డాడు. సందీప్కు అతని స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ సహకరించారు. విచక్షణా రహితంగా కొట్టి గొంతు నులిమి హత్యాయత్నం చేశారు.
దాడి అనంతరం.. అతడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకోని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజు చాలా సేపు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. డంపింగ్ యార్డు వద్ద రాజును గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ.. రాజును చంపారనుకుని.. వెంటనే సందీప్కు రూ.3 లక్షలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read:Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!
అయితే.. రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ.. అదే రాత్రి ఇంటిలో ఉన్న మరో 6 లక్షల రూపాయలు తీసుకుని సందీప్తో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారి వద్ద 5 లక్షల 40 వేల రూపాయల నగదు.. ఓ కారు, రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధం కోసం తాపత్రయ పడ్డ పద్మ.. అసలుకే ఎసరు వస్తుందని ఊహించలేదు. భర్తను అడ్డు తొలగించుకోవాలన్న పథకం బెడిసి కొట్టడంతో కటకటాలపాలైంది.
తాజావార్తలు
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!