Vizag Constable Case: భార్యే హంతకురాలు.. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Constable Case: విశాఖలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కానిస్టేబుల్ హత్య కేసును సీపీ స్వయంగా పర్యవేక్షించారు. రమేశ్ మృతి కేసుపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. రమేష్ భార్య శివాని మొబైల్లోని వీడియోస్, వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు. ఇప్పటికే భార్య శివాని, ప్రియుడు రామారావు, స్నేహితుడు నీలాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర కమిషనర్ సీపీ త్రివిక్రమ వర్మ మీడియాకు వివరించారు.
Also Read: Vizag Constable Case: ఆమె అందమే అతనికి శాపం.. ప్రియుడితో కలిసి కానిస్టేబుల్ని చంపిన భార్య
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ రమేష్ను భార్య శివాని హత్య చేయించిందని ఆయన తెలిపారు. మూడు రోజులు క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని భార్య ఫిర్యాదు చేసిందని.. ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోస్టుమార్టంకు పంపించినట్లు ఆయన తెలిపారు. అందులో ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలిందని.. దీనితో కేసును లోతుగా విచారించామని సీపీ వెల్లడించారు. భార్యే ప్రియుడి కోసం భర్తను చంపించిందని ఆయన చెప్పారు. మూడు రోజుల క్రితం మద్యం తాగించి వీడియో తీసిందన్నారు. ఆ తరువాత రమేష్ పడుకున్న తరువాత ప్రియుడు రామారావు బయట ఉన్నాడని.. రామారావు స్నేహితుడు దిండితో నొక్కి చంపాడని సీపీ వివరించారు. ఆ సమయంలో రమేష్ కదలకుండా భార్య కాళ్ళు పట్టుకుందని.. రమేష్ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చినట్లు సీపీ పేర్కొన్నారు.
వీరి ప్రేమ వ్యవహరంపై గతంలో అనేక గొడవలు జరిగాయని.. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్ళిపోవాలని రమేష్ కోరాడని సీపీ చెప్పారు. పిల్లలు, ప్రియుడు ఇద్దరు కావాలని అడ్డుగా ఉన్న రమేష్ను చంపిందని ఆయన తెలిపారు. ప్రియుడు రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చిందని.. శివానికి నేర స్వభావం ఉందని సీపీ చెప్పారు. ఆమె తల్లిదండ్రులతో కూడా గొడవలు ఉన్నాయన్నారు. ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!