WI vs IND 3rd ODI: వెస్టిండీస్పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WI vs IND, Team India recorded their biggest ODI win on Foreign Soil: మంగళవారం వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసి.. మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 352 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. గుడాకేష్ మోటీ చేసిన 39 పరుగులే టాప్ స్కోరర్. శార్దూల్ ఠాకూర్ (4/37) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది. శుభ్మన్ గిల్ (85; 92 బంతుల్లో 11 ఫోర్లు) భారీ హాఫ్ సెంచరీ చేశాడు.
352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. వరుసగా విండీస్పై 13 వన్డే సిరీస్లు గెలిచి చరిత్ర సృష్టించింది. 2007- 2023 మధ్య కాలంలో భారత్ సిరీస్లు గెలిచింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. జింబాబ్వే (1996- 21 మధ్య)పై 11 సార్లు వరుసగా వన్డే సిరీస్లు గెలిచిన పాకిస్తాన్.. రెండో స్థానంలో ఉంది. శ్రీలంక (2007-23)పై భారత్.. వెస్టిండీస్ (1999-22) పాకిస్తాన్ పదేసి విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
వెస్టిండీస్ను 200 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత భారత్.. విదేశీ గడ్డపై అతిపెద్ద వన్డే విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది. ఇదివరకు విదేశీ గడ్డపై భారత్ అతిపెద్ద వన్డే విజయం 125 పరుగులు. వెస్టిండీస్పైనే 2019 జూన్ 27న మాంచెస్టర్లో 125 పరుగుల విజయాన్ని నమోదు చేసింది. ఇక వన్డేల్లో వెస్టిండీస్పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా). 2018లో కరీబియన్ జట్టుపైనే భారత్ 224 పరుగుల తేడాతో నెగ్గింది. ఏ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది.
Also Read: Tomoto Price Today: కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!
𝗪𝗶𝗻𝗻𝗲𝗿𝘀 𝗔𝗿𝗲 𝗚𝗿𝗶𝗻𝗻𝗲𝗿𝘀! ☺️
Congratulations #TeamIndia on winning the ODI series 🙌 🙌#WIvIND pic.twitter.com/NHRD8k5AGe
— BCCI (@BCCI) August 1, 2023
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!