WI vs IND 3rd ODI: వెస్టిండీస్పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WI vs IND, Team India recorded their biggest ODI win on Foreign Soil: మంగళవారం వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసి.. మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 352 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. గుడాకేష్ మోటీ చేసిన 39 పరుగులే టాప్ స్కోరర్. శార్దూల్ ఠాకూర్ (4/37) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది. శుభ్మన్ గిల్ (85; 92 బంతుల్లో 11 ఫోర్లు) భారీ హాఫ్ సెంచరీ చేశాడు.
352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. వరుసగా విండీస్పై 13 వన్డే సిరీస్లు గెలిచి చరిత్ర సృష్టించింది. 2007- 2023 మధ్య కాలంలో భారత్ సిరీస్లు గెలిచింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. జింబాబ్వే (1996- 21 మధ్య)పై 11 సార్లు వరుసగా వన్డే సిరీస్లు గెలిచిన పాకిస్తాన్.. రెండో స్థానంలో ఉంది. శ్రీలంక (2007-23)పై భారత్.. వెస్టిండీస్ (1999-22) పాకిస్తాన్ పదేసి విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
వెస్టిండీస్ను 200 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత భారత్.. విదేశీ గడ్డపై అతిపెద్ద వన్డే విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది. ఇదివరకు విదేశీ గడ్డపై భారత్ అతిపెద్ద వన్డే విజయం 125 పరుగులు. వెస్టిండీస్పైనే 2019 జూన్ 27న మాంచెస్టర్లో 125 పరుగుల విజయాన్ని నమోదు చేసింది. ఇక వన్డేల్లో వెస్టిండీస్పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా). 2018లో కరీబియన్ జట్టుపైనే భారత్ 224 పరుగుల తేడాతో నెగ్గింది. ఏ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది.
Also Read: Tomoto Price Today: కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!
𝗪𝗶𝗻𝗻𝗲𝗿𝘀 𝗔𝗿𝗲 𝗚𝗿𝗶𝗻𝗻𝗲𝗿𝘀! ☺️
Congratulations #TeamIndia on winning the ODI series 🙌 🙌#WIvIND pic.twitter.com/NHRD8k5AGe
— BCCI (@BCCI) August 1, 2023
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!