WI vs IND 3rd ODI: వెస్టిండీస్పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WI vs IND, Team India recorded their biggest ODI win on Foreign Soil: మంగళవారం వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసి.. మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 352 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. గుడాకేష్ మోటీ చేసిన 39 పరుగులే టాప్ స్కోరర్. శార్దూల్ ఠాకూర్ (4/37) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది. శుభ్మన్ గిల్ (85; 92 బంతుల్లో 11 ఫోర్లు) భారీ హాఫ్ సెంచరీ చేశాడు.
352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. వరుసగా విండీస్పై 13 వన్డే సిరీస్లు గెలిచి చరిత్ర సృష్టించింది. 2007- 2023 మధ్య కాలంలో భారత్ సిరీస్లు గెలిచింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. జింబాబ్వే (1996- 21 మధ్య)పై 11 సార్లు వరుసగా వన్డే సిరీస్లు గెలిచిన పాకిస్తాన్.. రెండో స్థానంలో ఉంది. శ్రీలంక (2007-23)పై భారత్.. వెస్టిండీస్ (1999-22) పాకిస్తాన్ పదేసి విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read
- Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
- Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
- Akhilesh Yadav: ప్రభుత్వంతో డీల్..? కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అనుమానాలు..
- Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
వెస్టిండీస్ను 200 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత భారత్.. విదేశీ గడ్డపై అతిపెద్ద వన్డే విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది. ఇదివరకు విదేశీ గడ్డపై భారత్ అతిపెద్ద వన్డే విజయం 125 పరుగులు. వెస్టిండీస్పైనే 2019 జూన్ 27న మాంచెస్టర్లో 125 పరుగుల విజయాన్ని నమోదు చేసింది. ఇక వన్డేల్లో వెస్టిండీస్పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా). 2018లో కరీబియన్ జట్టుపైనే భారత్ 224 పరుగుల తేడాతో నెగ్గింది. ఏ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది.
Also Read: Tomoto Price Today: కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!
𝗪𝗶𝗻𝗻𝗲𝗿𝘀 𝗔𝗿𝗲 𝗚𝗿𝗶𝗻𝗻𝗲𝗿𝘀! ☺️
Congratulations #TeamIndia on winning the ODI series 🙌 🙌#WIvIND pic.twitter.com/NHRD8k5AGe
— BCCI (@BCCI) August 1, 2023
తాజావార్తలు
-
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
-
Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
-
AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
-
Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
-
Main Wapas Aaunga: హైదరాబాద్ థియేటర్లలో ‘మైన్ వాపస్ ఆవుంగా’ డైరెక్టర్
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!