Rs.12000: 12వేల కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. ఎనిమిది మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.12000: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని లోనారా, మోతపురా గ్రామాల ప్రజలు కేవలం రూ.12 వేల కోసం కొట్టుకున్నారు. ఈ దాడిలో రెండు గ్రామాల ప్రజలు ఒకరి రక్తాన్ని ఒకరు చిందించుకున్నారు. ఒకవైపు కర్రలతో, మరో వైపు నుంచి పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మోతపురా గ్రామంలో కేవలం రూ.12 వేల లావాదేవీపై మోతపురా గ్రామానికి చెందిన వారిపై లోనారా గ్రామస్తులు గొడవపడ్డారు. ఈ సమయంలో ప్రజలు ఒకవైపు నుంచి కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ 108 అంబులెన్స్లో ఖర్గోన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మోతాపూర్ గ్రామంలో ఉంటున్న సీతారాం మేనల్లుడు లోనారా గ్రామంలో ఉంటున్నాడు. ఈ మేనల్లుడికి సీతారాం 12 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు డబ్బులు ఇవ్వాలని సీతారాం ఇంటికి వెళ్లాడు. అతడు ఆ సమయంలో ఇంటిలో లేకపోవడంతో తిరిగి తన గ్రామానికి తిరిగి వచ్చాడు.
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
Read Also:Weather Update: తెలంగాణకు 4 రోజులు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
డబ్బులు అడిగేందుకే సీతారాం ఇంటికి వచ్చాడని మేనల్లుడు భార్య తెలియజేసింది. మేనల్లుడు డబ్బులు తిరిగి అడిగాడని కోపం పెంచుకున్నాడు. కొంత మంది గ్రామస్తులను తన వెంట తీసుకుని సీతారాం ఇంటికి చేరుకున్నాడు. తనతో పాటు ఉన్న 10 నుంచి 12 మంది గ్రామస్తులతో కలిసి సీతారాం, అతని కుటుంబసభ్యులపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. ఈ దాడి తర్వాత సీతారాం గ్రామస్థులు కూడా ఒక్కటయ్యారు. తన మేనల్లుడుతో పాటు వచ్చిన గ్రామస్తులపై దాడి చేశాడు. ఈ విషయం మేనల్లుడి గ్రామానికి తెలియగానే గ్రామస్తులు కూడా రావడంతో ఇరువురూ ఘర్షణకు దిగారు.
ఈ బలవంతపు దాడిలో కొందరు మహిళలు సహా మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో కొంతమంది గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారంతా మోతాపురా గ్రామానికి చెందినవారే కావడం విశేషం. దాడి చేసిన వారు లోనారా గ్రామ వాసులు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ..
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?