Rs.12000: 12వేల కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. ఎనిమిది మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.12000: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని లోనారా, మోతపురా గ్రామాల ప్రజలు కేవలం రూ.12 వేల కోసం కొట్టుకున్నారు. ఈ దాడిలో రెండు గ్రామాల ప్రజలు ఒకరి రక్తాన్ని ఒకరు చిందించుకున్నారు. ఒకవైపు కర్రలతో, మరో వైపు నుంచి పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మోతపురా గ్రామంలో కేవలం రూ.12 వేల లావాదేవీపై మోతపురా గ్రామానికి చెందిన వారిపై లోనారా గ్రామస్తులు గొడవపడ్డారు. ఈ సమయంలో ప్రజలు ఒకవైపు నుంచి కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ 108 అంబులెన్స్లో ఖర్గోన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మోతాపూర్ గ్రామంలో ఉంటున్న సీతారాం మేనల్లుడు లోనారా గ్రామంలో ఉంటున్నాడు. ఈ మేనల్లుడికి సీతారాం 12 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు డబ్బులు ఇవ్వాలని సీతారాం ఇంటికి వెళ్లాడు. అతడు ఆ సమయంలో ఇంటిలో లేకపోవడంతో తిరిగి తన గ్రామానికి తిరిగి వచ్చాడు.
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
Read Also:Weather Update: తెలంగాణకు 4 రోజులు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
డబ్బులు అడిగేందుకే సీతారాం ఇంటికి వచ్చాడని మేనల్లుడు భార్య తెలియజేసింది. మేనల్లుడు డబ్బులు తిరిగి అడిగాడని కోపం పెంచుకున్నాడు. కొంత మంది గ్రామస్తులను తన వెంట తీసుకుని సీతారాం ఇంటికి చేరుకున్నాడు. తనతో పాటు ఉన్న 10 నుంచి 12 మంది గ్రామస్తులతో కలిసి సీతారాం, అతని కుటుంబసభ్యులపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. ఈ దాడి తర్వాత సీతారాం గ్రామస్థులు కూడా ఒక్కటయ్యారు. తన మేనల్లుడుతో పాటు వచ్చిన గ్రామస్తులపై దాడి చేశాడు. ఈ విషయం మేనల్లుడి గ్రామానికి తెలియగానే గ్రామస్తులు కూడా రావడంతో ఇరువురూ ఘర్షణకు దిగారు.
ఈ బలవంతపు దాడిలో కొందరు మహిళలు సహా మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో కొంతమంది గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారంతా మోతాపురా గ్రామానికి చెందినవారే కావడం విశేషం. దాడి చేసిన వారు లోనారా గ్రామ వాసులు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ..
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!