Rs.12000: 12వేల కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. ఎనిమిది మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.12000: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని లోనారా, మోతపురా గ్రామాల ప్రజలు కేవలం రూ.12 వేల కోసం కొట్టుకున్నారు. ఈ దాడిలో రెండు గ్రామాల ప్రజలు ఒకరి రక్తాన్ని ఒకరు చిందించుకున్నారు. ఒకవైపు కర్రలతో, మరో వైపు నుంచి పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మోతపురా గ్రామంలో కేవలం రూ.12 వేల లావాదేవీపై మోతపురా గ్రామానికి చెందిన వారిపై లోనారా గ్రామస్తులు గొడవపడ్డారు. ఈ సమయంలో ప్రజలు ఒకవైపు నుంచి కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ 108 అంబులెన్స్లో ఖర్గోన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మోతాపూర్ గ్రామంలో ఉంటున్న సీతారాం మేనల్లుడు లోనారా గ్రామంలో ఉంటున్నాడు. ఈ మేనల్లుడికి సీతారాం 12 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు డబ్బులు ఇవ్వాలని సీతారాం ఇంటికి వెళ్లాడు. అతడు ఆ సమయంలో ఇంటిలో లేకపోవడంతో తిరిగి తన గ్రామానికి తిరిగి వచ్చాడు.
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
Read Also:Weather Update: తెలంగాణకు 4 రోజులు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
డబ్బులు అడిగేందుకే సీతారాం ఇంటికి వచ్చాడని మేనల్లుడు భార్య తెలియజేసింది. మేనల్లుడు డబ్బులు తిరిగి అడిగాడని కోపం పెంచుకున్నాడు. కొంత మంది గ్రామస్తులను తన వెంట తీసుకుని సీతారాం ఇంటికి చేరుకున్నాడు. తనతో పాటు ఉన్న 10 నుంచి 12 మంది గ్రామస్తులతో కలిసి సీతారాం, అతని కుటుంబసభ్యులపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. ఈ దాడి తర్వాత సీతారాం గ్రామస్థులు కూడా ఒక్కటయ్యారు. తన మేనల్లుడుతో పాటు వచ్చిన గ్రామస్తులపై దాడి చేశాడు. ఈ విషయం మేనల్లుడి గ్రామానికి తెలియగానే గ్రామస్తులు కూడా రావడంతో ఇరువురూ ఘర్షణకు దిగారు.
ఈ బలవంతపు దాడిలో కొందరు మహిళలు సహా మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో కొంతమంది గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారంతా మోతాపురా గ్రామానికి చెందినవారే కావడం విశేషం. దాడి చేసిన వారు లోనారా గ్రామ వాసులు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!