Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ..
Odisha Train Accident: మూడు దశాబ్ధాల కాలంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా మిగిలిన ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఘటనలో విద్రోహ కోణం ఏమైనా ఉందా..? లేకపోతే సాంకేతిక లోపమా..? అనే అంశాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విపక్షాలు ఈ రైలు ప్రమాదంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైల్వే బోర్డు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ చేయించాలని కోరింది. ప్రస్తుతం రెస్క్యూ పూర్తయిందని, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ట్రాక్ కు సంబంధించిన పనులు పూర్తికాగా.. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని, గాయపడిన ప్రయాణికులు చికిత్స పొందుతున్నారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: Operation Malamaal: ఢిల్లీ జంట హత్యల కేసులో పురోగతి.. మిలియనీర్ కావాలనే హత్యలు
Also Read
శుక్రవారం సాయంత్ర ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగిఉన్న గూడ్స్ రైలును ఢికొట్టింది. మెయిన్ ట్రాక్ నుంచి వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోరమాండల్ రైలు బోగీలు పక్కన ఉన్న పట్టాలపై పడ్డాయి. ఇదే సమయంలో బెంగళూర్- హౌరా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ పై పడి ఉన్న బోగీలను ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో 270 కన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
#WATCH | Railway Board recommends CBI probe related to #OdishaTrainAccident, announces Railways minister Vaishnaw pic.twitter.com/X9qUs55fZr
— ANI (@ANI) June 4, 2023
తాజావార్తలు
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో