Cough Syrup: భారత్లో తయారు చేసిన 7 దగ్గు సిరప్లను బ్లాక్లిస్ట్ చేసిన WHO
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cough Syrup: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దగ్గు మందు మరణాల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంది. WHO భారతదేశంలో తయారు చేయబడిన ఏడు దగ్గుమందులను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఓ నివేదిక ప్రకారం అనేక దేశాలలో దగ్గు సిరప్ కారణంగా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. ఆ తరువాత WHO ఈ చర్యకు పూనుకుంది. ఈ వ్యక్తులు దగ్గు సిరప్ తాగడం వల్లే చనిపోయారని WHO అభిప్రాయపడింది. గత కొన్ని నెలల్లో నైజీరియా, గాంబియా, ఉజ్బెకిస్థాన్లలో దగ్గు సిరప్ తాగడం వల్ల అనేక మరణాలు నమోదయ్యాయి.
WHO ప్రతినిధి ప్రకారం.. భారతదేశం, ఇండోనేషియాలోని ఫార్మా కంపెనీలు తయారు చేసిన 20 కంటే ఎక్కువ దగ్గు సిరప్లను పరీక్షించారు. విచారణ తర్వాత WHO భారతదేశంలో తయారు చేయబడిన ఈ దగ్గు సిరప్ గురించి హెచ్చరికను కూడా జారీ చేసింది. గాంబియా, ఉజ్బెకిస్థాన్ మరణాల తర్వాత వివాదంలోకి వచ్చినవి ఈ దగ్గు సిరప్లు. దగ్గు సిరప్ తాగడం వల్ల 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Read Also:Nagarjuna Akkineni: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్సిచ్చిన నాగార్జున?
భారత్లోనూ నిషేధం
అంతకుముందు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్, చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా, పంజాబ్కు చెందిన క్యూపి ఫార్మాకెమ్, హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్తో సహా అనేక ఇతర ఫార్మా కంపెనీలను కూడా విచారించింది. ఈ విచారణలో కొన్ని అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత డ్రగ్ కంట్రోలర్ ఈ కంపెనీల కార్యకలాపాలను నిషేధించింది. ఔషధాలను ఎగుమతి చేసే ముందు వాటి నాణ్యత నియంత్రణ ఉంటుందని సీడీఎస్సీఓ వర్గాలు తెలిపాయి.
మీడియా నివేదికల ప్రకారం.. ఈ రకమైన దగ్గు సిరప్ 9 దేశాలలో అమ్మకం జరిగింది. ఈ రకమైన దగ్గు సిరప్ రాబోయే కొన్నేళ్లపాటు చాలా దేశాల్లో అందుబాటులో ఉంటుందని భయపడుతున్నారు. ఇందులో లభించే దగ్గు సిరప్, ప్రొపైలిన్ గ్లైకాల్ షెల్ఫ్ జీవితం దాదాపు రెండు సంవత్సరాలు ఉంటుంది. WHO దీనిని పెద్ద ముప్పుగా పరిగణించడానికి ఇదే కారణం.
Read Also:Food Grain Prices : ద్రవ్యోల్బణం, రుతుపవనాల ఆలస్యం.. 15రోజుల్లో భారీగా పెరిగిన బియ్యం, పప్పు ధరలు
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!