Bird Flu: బర్డ్ఫ్లూతో తొలి మరణం.. ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Health Organization: బర్డ్ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డయేరియా, వాంతుల లాంటి లక్షణాలతో హస్పటల్ లో చేరిన 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 24వ తేదీన మరణించినట్లు మెక్సికో తమకు సమాచారం ఇచ్చినట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. పౌల్ట్రీ, జంతువుల వద్దకు బాధితుడు వెళ్లిన ఆధారాలు కూడా లేవని చెప్పింది. అయితే, ఆయనకు ఫస్ట్ నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.. వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని ఆరోగ్య సంస్థ పేర్కొంది.
Read Also: Pinnelli Ramakrishna Reddy: నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు..
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
కాగా, ఏవియన్ ఫ్లూ లక్షణాలు బయటపడడానికి ముందే బాధితుడు మూడు వారాల నుంచి అనారోగ్యం పాలైనట్లు అధికారులు తెలిపారు. అతడికి వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది అనేది ఇంకా గుర్తించలేకపోయారు. మెక్సికోలో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. అయితే అక్కడి నుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని డబ్ల్యూహెచ్వో పేర్కొనింది. మరోవైపు బర్డ్ఫ్లూలోనే మరో వేరియంట్ హెచ్5ఎన్1 అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ పని చేస్తున్న కొంత మందికి ఇది సోకినట్లు నిర్ధరించుకున్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు నిర్ధరణ చేయలేదు.
అయితే, ఇటీవల భారతదేశంలోని పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అలర్ట్ గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశు సంవర్థక విభాగంతో పంచుకోవాలని పేర్కొనింది. దీని వల్ల ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రజారోగ్య కార్యాచరణను చేపట్టవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!