Vinod Kumar: మోడీ ఎక్కడకు వెళ్లిన అవినీతి అనే మాటలు తప్ప ఎలాంటి మాటలు రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంపైన, సీఎం కేసీఆర్ పైన ప్రధాన మంత్రి మోడీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో అనేక మంది కుటుంబ సభ్యులు ఎంపీలుగా ఉన్నారు.. అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అంటున్నారు.. ఎక్కడ అవినీతి ఉందొ తెల్వదా?.. అని వినోద్ కుమార్ అడిగారు. నవోదయ విద్యాలయాలు కావాలని మేము అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదు.. అప్పుడు ఆ శాఖ మంత్రి ఇప్పటి ఇంచార్జ్ జవదేకర్ ఉండే.. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకు నవోదయ పాఠశాలలు అని ప్రశ్నించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
యూనివర్సిటీ లలో ఉద్యోగ నియామకాలు జరగాలి అనే చట్టం చేస్తే ఇప్పటికి ఆమోదం తెలుపలేదు అని వినోద్ కుమార్ అన్నారు. మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు.. ఎన్నికలు వస్తున్నాయి కదా ఏమైనా ప్రకటనలు చేస్తాడేమో అని అనుకున్నము కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో యావత్ తెలంగాణ ప్రజలు నిరాశ చెందారు అని ఆయన తెలిపారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఎదో ప్రకటన చేసే మోడీ ఇక్కడ మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయలేదు అని వెల్లడించారు.
Read Also: Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ప్రకటన చేయలేదు అంటేనే అర్థం అవుతుంది.. ఎందుకంటే ఇక్కడ గెలిచేది లేదు కాబట్టే అలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం మోడీకి లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ప్రకటన చేస్తాడేమోనని అనుకున్నాం.. అనేక రహదారులు జాతీయ రహదరులుగా ప్రకటన చేస్తాడని అనుకున్నాం.. కానీ పాత వాటికే శంకుస్థాపన చేశారు తప్ప కొత్తవి ప్రకటన చేయలేదన్నాడు.
Read Also: Minister RK Roja: ఓడించడానికి ఇది మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగనన్న అడ్డా..
విభజన హామీలు ఒక్కటి కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదు అని వినోద్ కుమార్ అన్నారు. ఆబ్కా సర్కార్ బీజేపీ సర్కార్ అన్నాడు.. ఇది కూడా కిసాన్ సర్కార్ అనే మన నినాదంను నుంచే మోడీ కాఫీ కొట్టాడు అని తెలిపాడు. వరంగల్ సభలో తెలంగాణ ప్రజలను బీజేపీ ఇవాళ మళ్ళీ వంచించింది. తెలంగాణ ప్రజలను మోడీ మరోసారి మోసం చేశాడు.. అయితే, మోడీ ఎక్కడకు వెళ్లిన అవినీతి అనే మాటలు తప్ప ఎలాంటి మాటలు రావు.. ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రతి దగ్గర కూడా ఇలాంటి మాటలే మోడీ మాట్లాడుతారు అని వినోద్ కుమార్ అన్నారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- PM Modi
- vinod kumar
తాజావార్తలు
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!