Vinod Kumar: మోడీ ఎక్కడకు వెళ్లిన అవినీతి అనే మాటలు తప్ప ఎలాంటి మాటలు రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంపైన, సీఎం కేసీఆర్ పైన ప్రధాన మంత్రి మోడీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో అనేక మంది కుటుంబ సభ్యులు ఎంపీలుగా ఉన్నారు.. అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అంటున్నారు.. ఎక్కడ అవినీతి ఉందొ తెల్వదా?.. అని వినోద్ కుమార్ అడిగారు. నవోదయ విద్యాలయాలు కావాలని మేము అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదు.. అప్పుడు ఆ శాఖ మంత్రి ఇప్పటి ఇంచార్జ్ జవదేకర్ ఉండే.. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకు నవోదయ పాఠశాలలు అని ప్రశ్నించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
యూనివర్సిటీ లలో ఉద్యోగ నియామకాలు జరగాలి అనే చట్టం చేస్తే ఇప్పటికి ఆమోదం తెలుపలేదు అని వినోద్ కుమార్ అన్నారు. మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు.. ఎన్నికలు వస్తున్నాయి కదా ఏమైనా ప్రకటనలు చేస్తాడేమో అని అనుకున్నము కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో యావత్ తెలంగాణ ప్రజలు నిరాశ చెందారు అని ఆయన తెలిపారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఎదో ప్రకటన చేసే మోడీ ఇక్కడ మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయలేదు అని వెల్లడించారు.
Read Also: Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ప్రకటన చేయలేదు అంటేనే అర్థం అవుతుంది.. ఎందుకంటే ఇక్కడ గెలిచేది లేదు కాబట్టే అలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం మోడీకి లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ప్రకటన చేస్తాడేమోనని అనుకున్నాం.. అనేక రహదారులు జాతీయ రహదరులుగా ప్రకటన చేస్తాడని అనుకున్నాం.. కానీ పాత వాటికే శంకుస్థాపన చేశారు తప్ప కొత్తవి ప్రకటన చేయలేదన్నాడు.
Read Also: Minister RK Roja: ఓడించడానికి ఇది మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగనన్న అడ్డా..
విభజన హామీలు ఒక్కటి కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదు అని వినోద్ కుమార్ అన్నారు. ఆబ్కా సర్కార్ బీజేపీ సర్కార్ అన్నాడు.. ఇది కూడా కిసాన్ సర్కార్ అనే మన నినాదంను నుంచే మోడీ కాఫీ కొట్టాడు అని తెలిపాడు. వరంగల్ సభలో తెలంగాణ ప్రజలను బీజేపీ ఇవాళ మళ్ళీ వంచించింది. తెలంగాణ ప్రజలను మోడీ మరోసారి మోసం చేశాడు.. అయితే, మోడీ ఎక్కడకు వెళ్లిన అవినీతి అనే మాటలు తప్ప ఎలాంటి మాటలు రావు.. ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రతి దగ్గర కూడా ఇలాంటి మాటలే మోడీ మాట్లాడుతారు అని వినోద్ కుమార్ అన్నారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- PM Modi
- vinod kumar
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!