8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. జీతాల్లో భారీ పెరుగుదల.?
- దేశంలో 7వ వేతన సంఘం జనవరి 1 2016 నుంచి అమలులోకి వచ్చింది.
- ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమీషన్ అమలవుతుంది.
- 2026 జనవరి 1 నుండి 8వ పే కమిషన్ను అమలు చేస్తుందని భావిస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8th Pay Commission: 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా దాదాపు కోటి మంది లబ్ధి పొందారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమీషన్ అమలవుతుంది కాబట్టి, ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2026 జనవరి 1 నుండి 8వ పే కమిషన్ను అమలు చేస్తుందని భావిస్తున్నారు. దీంతో కనీస వేతనం, పెన్షన్లో పెను మార్పులు వస్తాయని భావిస్తున్నారు.
WI vs SA: సొంతగడ్డపై తేలిపోయిన విండీస్.. సిరీస్ గెలిచిన సఫారీలు..
Also Read
- Nara Lokesh: 'రప్పారప్పా' అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
- Sachin Tendulkar: "ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!" ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
అయితే, 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుందని పేర్కొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్లలో ఈసారి కొత్త వేతన సంఘం అమలు అవుతుందా లేదా అన్న ఆందోళనలో పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. 8వ వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ను ఇదే విషయమై ప్రశ్నించగా.. ఈ పనులకు ఇంకా సమయం సరిపోతుందని చెప్పారు.
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఆర్జిత సేవా టికెట్లు విడుదల!
6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారిన సందర్భంగా.. వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను 3.68గా ఉంచాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయగా, ప్రభుత్వం దానిని 2.57గా ఉంచింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సాయంతో కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 7000 నుంచి రూ. 18వేలకు పెంచారు. దీంతోపాటు కనీస పెన్షన్ కూడా రూ. 3500 నుంచి రూ. 9000కి పెరిగింది. పని చేసే ఉద్యోగుల గరిష్ట వేతనం రూ. 2.50 లక్షలు కాగా, గరిష్ట పెన్షన్ కూడా రూ. 1.25 లక్షలుగా మారింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ ఆమోదం పొందితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92కు పెంచవచ్చు. దీని సహాయంతో దేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేల నుంచి రూ. 34,560కి పెరగడంతో పాటు కనీస పెన్షన్ రూ. 17,280కి చేరుకోవచ్చు. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది చాలా ఊరటనిస్తుంది.
తాజావార్తలు
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!