1. నేడు హైదరాబాద్కు కేంద్ర హోమంత్రి అమిత్ షా. చేవెళ్ల సభలో పాల్గొననున్న అమిత్షా.
2. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు.
3. నేడు ఐపీల్లో 2023లో కోల్కతా వేదికగా రాత్రి 7.30కి తలపడనున్న కోల్కతా vs చెన్నై. మధ్యాహ్నం 3.30కి బెంగళూరు vs రాజస్థాన్.
4. నేడు తెరుచుకోనున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్. గత ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు ఇటీవల కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత లక్ష్మణ్. తాళాలు మిస్సవండో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టాలని కోర్టు ఆదేశం. ఉదయం 10.30 గంటలకు తాళాలు పగులగొట్టనున్న అధికారులు.
5. నేడు అయోధ్యలో కీలక ఘట్టం. 155 దేశాల నదుల నీటితో అయోధ్యలో జలాభిషేకం. ఉజ్జెకిస్తాన్, పాకిస్తాన్, చైనా సహా అయోధ్యకు చేరుకున్న 155 దేశాల నదుల నీరు.
6. హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,820 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,400 లుగా ఉంది.
7. నేడు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల క్రింద ఉండరాదని వాతావరణ శాఖ హెచ్చరిక. అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం.