Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు కాకినాడలో పర్యటించనున్న సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కలెక్టరేట్లో శాఖాపరమైన అంశాలు, తనిఖీలపై అధికారులతో సమీక్ష సమావేశం.. చెక్ పోస్ట్ ,పోర్ట్ ఏరియాను స్వయంగా తనిఖీ చేయనున్న మంత్రి.
*నెల్లూరు జిల్లా: నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఎం.ఆర్. కురూప్ ఆడిటోరియంలో జరిగే అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్.. అనంతరం షార్లోని వివిధ విభాగాల సందర్శన.. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
*అమరావతి: నేడు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం.. ఇవాళ , రేపు రెండు రోజులు సమావేశం కానున్న జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో జగన్ సమావేశం
*విశాఖ: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు.. ఇప్పటివరకు రెండు నామినేషన్లు దాఖలు.. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి.. టీడీపీ తుది నిర్ణయంపై ఉత్కంఠ.. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందు పరిచిన బొత్స.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు చూపించిన వైసీపీ అభ్యర్థి.
*నేడు గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం.. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతారామ బహుళార్థసాధక ప్రాజెక్టు పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను జీఆర్ఎంబీకి సమర్పించనున్న తెలంగాణ.. జీఆర్ఎంబీ భేటీకి హాజరుకావాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు జీఆర్ఎంబీ సమాచారం పంపిన జీఆర్ఎంబీ.. ఈనెల 6న జరగాల్సిన ఈ సమావేశాన్ని తెలంగాణ అభ్యర్థన మేరకు నేటికి వాయిదా వేసిన గోదావరి బోర్డు
*నేడు అనంతపురం జిల్లాలో మంత్రులు పయ్యావుల, నిమ్మల పర్యటన.. తుంగభద్ర డ్యాంను సందర్శించనున్న మంత్రులు.. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును పరిశీలించనున్న మంత్రులు.. స్థానిక డ్యాం, ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్న పయ్యావుల, నిమ్మల.
*నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును పరిశీలించనున్న సిద్ధరామయ్య.. తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో కర్ణాటక సీఎం సమీక్ష.
*తిరుమల: 24 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,728 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,611 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు
*నేడు అహ్మదాబాద్లో హర్ఘర్ తిరంగా యాత్ర.. హర్ఘర్ తిరంగా యాత్రలో పాల్గొననున్న అమిత్ షా.
*నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ.. అతి త్వరలోనే తెలంగాణతో సహా, 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియమాకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన.. ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు.. నేడు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇంచార్జ్లు, రాష్ట్రాల ఇంచార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో విస్తృత సమావేశం.. దిశా నిర్దేశం చేయనున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బృహత్తర కార్యాచరణ.. తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకం… అలాగే, ఏఐసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసిసి ఇంచార్జ్ లను నియామకం చేయనున్న అధిష్టానం.
*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,710.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,590.. హైదరాబాద్లో కిలో వెండి రూ.87,400.
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!