What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై-ముంబై మధ్య మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరుతో ఢీకొననున్న ఢిల్లీ
* బెంగుళూరులో ఇవాళ ప్రధాని మోడీ రోడ్ షో.. దాదాపు 26 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొననున్న మోడీ.. రోడ్ షో తర్వాత బడమి, హవేరి బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని
Also Read
* కర్నాటక ఎన్నికల ప్రచారంలోకి సోనియా గాంధీ.. బెల్గావి, హుబ్లీలో రాహుల్ గాంధీతో కలసి ప్రచారం చేయనున్న సోనియా
* నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం.. క్రమేపీ బలపడి తుఫాన్ గా మారుతుందని ఐఎండీ అంచనా. ఈనెల 9, 10 తేదీల్లో కనిపించనున్న తుఫాన్ ప్రభావం.
* విజయవాడ: నేడు పదో తరగతి ఫలితాలు విడుదల.. ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
* నేడు మహబూబ్ నగర్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన. ఐటీ కారిడార్, శిల్పారామం ప్రారంభోత్సంలో పాల్గొననున్న కేటీఆర్.. బాయ్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రసంగించనున్న మంత్రి.
* ప్రకాశం : ప్రొద్దుటూరులో టిడ్కో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.
* బాపట్ల : చీరాల మండలం వాడరేవులో పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా సిడి మాను ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు..
* ప్రకాశం : గిద్దలూరు లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా గరుడ సేవ, రథోత్సవం..
* తూర్పుగోదావరి: నేడు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన.. ఉదయం 10 గంటలకు కొవ్వురు రోడ్ కం రైల్ బ్రిడ్జి నుంచి పర్యటన ప్రారంభం.. చాగల్లు మండలం ఐ పంగిడి, చాగల్లు, ఊనగట్ల, బ్రాహ్మణగూడెం ప్రాంతాలలో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ.. మధ్యాహ్నం రెండు గంటలకు నిడదవోలు మండలం కంసాలిపాలెం, తీరిగూడెం, సింగవరం ప్రాంతాల్లో పర్యటన..
* కడప: నేడు ప్రొద్దుటూరులో పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న జిల్లా ఇంఛార్జి మంత్రి ఆది మూలపు సురేష్…
* అనంతపురం: కంబదూరు మండల పరిధిలోని పాళ్ళూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషాశ్రీచరణ్.
* అనంతపురం : నేడు ఉమ్మడి జడ్పీ సర్వసభ్య సమావేశం.
* నెల్లూరు: ముత్తుకూరు, పొదలకూరు మండలాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
* అల్లూరి జిల్లా మన్యం ఆరాధ్య దేవత శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి మూల విరాట దర్శనం నేటి నుండి మూడురోజుల పాటు మూసివేత.. జాతర మహోత్సవాలు నేపథ్యంలో అలంకరణ నిమిత్తం ఆలయం మూసివేత.
* గుంటూరు : నేడు ఎల్ఈఎం గ్రౌండ్ లో ఐపీఎల్ మ్యాచ్ ల ప్రదర్శన.. నేడు ,రేపు భారీ డిజిటల్ స్క్రీన్ లతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసిన బీసీసీఐ
* ఖమ్మం: నేడు మాజీ ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో రైతు భరోసా ర్యాలీ. ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్ల మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి డిమాండ్.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!