What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- అరటి రైతులతో మాట్లాడనున్న వైఎస్ జగన్
- విశాఖలో పర్యటించనున్న మంత్రి దుర్గేష్
- ఇవాళ విశాఖలో ఐపీఎల్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత నియోజకవర్గమైన పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న అరటి తోటలను మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులతో జగన్ మాట్లాడనున్నారు.
ఇవాళ పెనుకొండ జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు మంత్రి సవిత భూమి పూజ చేయనున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పాలకమండలి సమావేశంలో పాల్గొంటారు.
ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పాలకమండలి ఆమోదించనుంది.
ఈరోజు ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనుంది.
నేడు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ విశాఖలో పర్యటించనున్నారు. రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరించనున్నారు.
నేడు బలభద్రపురానికి విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్య బృందం వెళ్లనుంది. గ్రామంలోని క్యాన్సర్ అనుమానితులకు వైద్య పరీక్షలు, గ్రామస్తులకు వైద్య బృందం అవగాహన కల్పించనుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాటల యుద్ధంతో సభ రసవత్తరంగా సాగనుంది.
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవాళ విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. లక్నోతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఈరోజు పంజాగుట్ట పోలీసుల ఎదుట నటి శ్యామల హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో శ్యామలపై కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!