What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్
- గాంధీభవన్కు కురియన్ కమిటీ
- మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Also Read
- Raashii Khanna: పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
- Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
- Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
నేడు కడపలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించనున్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్ వస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
కేంద్రమంత్రి కుమారస్వామి నెడ్ విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంటుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్లాంట్ పనితీరు, ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు.
నేడు గాంధీభవన్కు కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఓటమికి గల కారణాలపై కమిటీ సమీక్ష జరపనుంది.
నేడు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో రైతుభరోసాపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. భట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క హాజరుకానున్నారు. రైతు భరోసాపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకోనున్నారు. లంచ్ తరువాత 3.30 గంటలకు హైదారాబాద్ కు తిరుగు ప్రయాణంఅవుతారు.
నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో 317 జీవోపై భేటీ జరగనుంది.
తాజావార్తలు
-
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
-
Raashii Khanna: పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
-
Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!