February 1st chage Rules : బడ్జెట్లో ఏం జరిగినా.. ఫిబ్రవరి నుంచి ఛేంజ్ అయ్యేవి ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
February 1st chage Rules : ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రవేశపెడతారు. బడ్జెట్తో పాటు అనేక ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించిన ఈ మార్పులు సామాన్యుల ఖర్చులలో మార్పులను తెస్తాయి. ఫిబ్రవరి 1 నుండి అమలు చేయబడే మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
LPG సిలిండర్ ధరలలో మార్పు
LPG సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన అప్ డేట్ అవుతాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలను విడుదల చేశాయి. ఇది సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున LPG గ్యాస్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చూడాలి. జనవరిలో కొన్ని మార్పుల తర్వాత 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గించబడింది.
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
Read Also:Telangana Jagruthi: నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం.. సాగునీటి ప్రాజెక్టులపై కీలక చర్చ!
UPI లావాదేవీలకు సంబంధించిన కొత్త నియమాలు
UPI కింద జరుగుతున్న కొన్ని లావాదేవీలలో మార్పులు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయించింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న UPI లావాదేవీ ఐడీలు ఆమోదించబడవు. ఇప్పుడు ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఏదైనా లావాదేవీకి వేరే ఏదైనా రకమైన ఐడీ ఉంటే అది విఫలమవుతుంది.
పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫిబ్రవరి 1 నుండి తన వివిధ మోడళ్ల ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఈ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు కారణంగా ధరలు మారే మోడల్స్. వీటిలో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంకోక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా ఉన్నాయి.
Read Also:CM Chandrababu: నేడు పెనుగొండకు ఏపీ సీఎం చంద్రబాబు
బ్యాంకింగ్ నిబంధనలలో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొన్ని సేవలు, ఛార్జీలలో మార్పులను ప్రకటించింది. ఇవి ఫిబ్రవరి 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. వీటిలో ప్రధాన మార్పులు ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితిని తగ్గించడం, ఇతర బ్యాంకింగ్ సేవలపై ఛార్జీలను పెంచడం కావచ్చు. ఈ మార్పులు బ్యాంకు కస్టమర్లను ప్రభావితం చేస్తాయి. వారు ఈ కొత్త రుసుము నిర్మాణాలతో తమ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ATF ధరలో మార్పు
ఫిబ్రవరి 1 నుండి ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలో మార్పు ఉండవచ్చు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. ఈసారి ధరలు పెరిగితే, అది విమాన ప్రయాణికుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!