Supreme Court: మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారు..? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు వేసింది. గోసంరక్షకులు, అల్లరిమూకల కేసులపై తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా తెలియజేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మహిళా సంస్థ పిటిషన్ను ఆరు వారాల తర్వాత విచారించాలని నిర్ణయించింది.
Election Commission: భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్
Also Read
గోసంరక్షకుల ఆరోపణతో ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న ఘటనలను పరిష్కరించడానికి 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ క్రమంలో.. మాబ్ లించింగ్ ఉదంతాలను పేర్కొంటూ రిట్ పిటిషన్కు చాలా రాష్ట్రాలు తమ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయలేదని తాము గుర్తించామని బెంచ్ ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై రాష్ట్రాలు కనీసం సమాధానం చెప్పాలని బెంచ్ భావించింది. ఇంకా సమాధానం దాఖలు చేయని రాష్ట్రాలకు తాము ఆరు వారాల సమయం ఇస్తున్నామని తెలిపింది.
Off The Record: ఆ ఎమ్మెల్యేను ఆటలో అరటిపండు అనుకుంటున్నారా..?
కాగా.. మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా పోలీస్ డైరెక్టర్ జనరల్లకు నోటీసులు జారీ చేసింది. సీపీఐకి చెందిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్పై వారి స్పందనను కోరింది. విచారణ సందర్భంగా.. పిటిషనర్ సంస్థ తరఫు న్యాయవాది నిజాం పాషా మాట్లాడుతూ, మధ్యప్రదేశ్లో మూక హత్యల సంఘటన జరిగిందని.. అయితే బాధితులపై గోహత్యకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. మూక హత్యల ఘటనను రాష్ట్రం నిరాకరిస్తే.. 2018లో పూనావాలా కేసులో తీర్పును ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. గోసంరక్షకుల ఘటనలను అరికట్టేందుకు సుప్రీం కోర్టు రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!