Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి తెలుగు సినీ అభిమాని భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా ఇంకా సెట్స్పై ఉండగానే మహేష్ బాబు తర్వాతి సినిమా ఏంటన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల! టీమిండియాకు తిరిగి వస్తాడా?
నిజానికి ఒక సినిమా షూటింగ్లో ఉండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను లాక్ చేసుకునే అలవాటు మహేష్కు ఉంది. ఇదివరకు ‘గుంటూరు కారం’ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే రాజమౌళి సినిమాను ఖరారు చేశారు మహేష్. కానీ, ఈసారి మాత్రం తన సెంటిమెంట్ను పక్కన పెట్టి ‘వారణాసి’ పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని సమాచారం. జూన్ చివరి నాటికి ‘వారణాసి’ షూటింగ్ పూర్తి కానుందని చిత్ర వర్గాల సమాచారం. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్, డబ్బింగ్ వంటి పనులు మిగిలి ఉంటాయి. దీంతో మహేష్ డేట్స్పై అగ్ర నిర్మాణ సంస్థలు దృష్టి సారించాయి.
Actress Pratyusha: నటి ప్రత్యూష తల్లి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లందరూ కుక్క చావు చస్తారంటూ..
ఇందులో ముఖ్యంగా హోంబేలె ఫిలిమ్స్, సన్ పిక్చర్స్ సంస్థలు మహేష్తో తదుపరి సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ అంటే సహజంగానే భారీ బడ్జెట్, భారీ అంచనాలు ఉంటాయి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్తోనే ప్రాజెక్ట్ ఉండాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ‘వారణాసి’ విడుదల తర్వాతే తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.