Agnipath Scheme: అసలు అగ్నిపథ్ స్కీమ్ ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశ సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చి దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్ స్కీమ్’ని తీసుకువచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు జూన్ 14న ఈ స్కీమ్ ను ప్రకటించారు. భారతీయ సైన్యంలో యువరక్తాన్ని ప్రవేశపెట్టడంతో పాటు సైన్యం బడ్జెట్ లో పెన్షన్లకు వెచ్చించే నిధులకు కోత వేయడంతో పాటు ఈ నిధులను ఆధునిక ఆయుధాల కొనుగోలుకు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు ఉన్న యువకులను 4 ఏళ్ల కాలానికి సైన్యంలో రిక్రూట్ చేసుకోనున్నారు. అయితే తాజాగా 21 ఏళ్ల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతూ కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కాలానికి సంబంధించి వచ్చే మూడు నెలల్లో రిక్రూట్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తామని ఆర్మీ అధిపతులు వెల్లడించారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ లో సెలక్ట్ అయిన వారిని ‘ అగ్నివీర్’లుగా పిలుస్తారు. వీరిని సైన్యంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లోకి తీసుకుంటారు. 45,000 మందిని తొలి బ్యాచ్ కింద తీసుకోనున్నారు. 2023 జూలై నాటికి తొలి బ్యాచ్ ను సిద్ధం చేయాలని సైన్యం భావిస్తోంది. ఇలా చేరిన వారికి 6 నెలల పాటు టెక్నాలజీతో పాటు ఆర్మీ శిక్షణ ఇవ్వనున్నారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
ఆర్మీలో జాయిన్ అయిన అగ్నివీర్లకు సాధారణ సైనికుడికి ఉండే విద్యార్హత ఉండనుంది. పదో తరగతి మినిమం క్వాలిఫికేషన్. ఆన్ లైన్ విధానం ద్వారా ఎంపిక జరగనుంది. అయితే నాలుగేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన యువతను రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ నాలుగేళ్లలో మొదటి ఏడాది రూ. 4.76 లక్షల ప్యాకేజీతో జీతం ప్రారంభం అయి నాలుగో ఏడాది రూ. 6.92 లక్షలకు చేరనుంది. దీంతో నాలుగేళ్ల తరువాత రిటైర్మెంట్ తరువాత సేవానిధి కింద ఒక్కొక్కరికి రూ.11.71 లక్షల ప్యాకేజీ రానుంది. దీంతో పాటు విధి నిర్వహణ సమయంలో రూ.48 లక్షల బీమా కవరేజీని కూడా కేంద్రం అందించనుంది.
అయితే పెన్షన్ వంటి సదుపాయాలు మాత్రం ఉండవు. నాలుగేళ్ల తరువాత కేవలం 25 శాతం మందిని మాత్రమే వారి అర్హత, ప్రతిభ ఆధారంగా మరో 15 ఏళ్ల పాటు సైన్యంలో కొనసాగించనున్నారు. నాలుగేళ్ల రిటైర్మెంట్ తరువాత వాళ్ల కెరీన్ ను ప్లాన్ చేసుకునేందుకు సేవానిధి ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. దీంతో పాటు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా తరువాత పోలీస్, బీఎస్ఎఫ్ ఇతర రక్షణ దళాల్లో పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.
సైన్యాన్ని యువతతో నింపడంతో పాటు కొన్ని ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇజ్రాయిల్, చైనా వంటి దేశాల్లో ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నియమం ఉంది. దీని వల్ల వాళ్ల రిజర్వ్ బెంచ్ ను తయారు చేసుకుంటోంది. యుద్ధ సమయంలో రిజర్వ్ బెంచ్ అనేది కీలకంగా ఉంటుంది. 2022-23 రూ. 5,25,166 కోట్లు, ఇందులో రక్షణ పెన్షన్ల కోసం రూ. 1,19,696 కోట్లు కేటాయించారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ సక్సెస్ అయితే పెన్షన్ బడ్జెట్ ను నూతన ఆయుధాల కొనుగోలుకు, టెక్నాలజీకి వినియోగించే అవకాశం ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?