IPL 2025: మ్యాచ్ టై లేదా రద్దు అయితే.. రూల్స్ ఏమి చెబుతున్నాయంటే!
- మార్చి 22 నుండి IPL 2025 సీజన్ ప్రారంభం,
- జట్టు విజయం సాధిస్తే 2 పాయింట్లు
- ఏదైనా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొక పాయింట్
- మ్యాచ్ టై అయినప్పుడు, సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ నిర్ణయం
- విజయం సాధించిన జట్టుకు 2 పాయింట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: ఈ ఏడాది ఐపీఎల్ 2025 సీజన్ రేపటి (మార్చి 22) నుండి ప్రారంభం కానుంది. చివరగా ఫైనల్ మ్యాచ్ 25 మే 2025 న జరగనుంది. ఇందులో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో, మ్యాచ్ టై లేదా రద్దు అయినా, పాయింట్లు ఎలా ఇస్తారన్న విషయాలను చూద్దాం.
Read Also: IPL 2025: ఉప్పల్లో ఎల్లుండి మ్యాచ్.. భారీ బందోబస్తు ఏర్పాటు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఐపీఎల్ 2025లో మొత్తం 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు విజయం సాధిస్తే 2 పాయింట్లు పొందుతుంది. అయితే, ఏదైనా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొక పాయింట్ ఇవ్వబడుతాయి. మ్యాచ్ టై అయినప్పుడు, సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ నిర్ణయం తీసుకుంటారు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన జట్టుకి 2 పాయింట్లు ఇవ్వబడతాయి. ఇలా లీగ్ స్టేజ్లో ఒక్కొక జట్టు 14 మ్యాచ్లు ఆడిన అనంతరం టాప్-4 జట్లు ప్లే-ఆఫ్కు అర్హత సాధిస్తాయి. అలాగే, పాయింట్ల పట్టికలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్ల అంకెలు సమం ఉంటే, వాటి నెట్ రన్రేట్ ఆధారంగా టాప్-4 జట్లు నిర్ణయించబడతాయి.
Read Also: NZ vs Pak: ఎట్టకేలకు గెలుపు సాధించిన పాకిస్థాన్.. హసన్ నవాజ్ తుఫాను సెంచరీ
ఇక ప్లే-ఆఫ్ సమయంలో నియమాలను చూస్తే.. లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత టాప్-2 జట్లు ప్లే-ఆఫ్ లో పెద్ద అనుకూలత పొందుతాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగుతుంది. దీని విజేత నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. మూడో, నాలుగో స్థానంలో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు మొదటి క్వాలిఫయర్లో ఓడిన జట్టుతో రెండవ క్వాలిఫయర్ కోసం తలపడుతుంది. చివరగా, రెండవ క్వాలిఫయర్లో విజయం సాధించిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ లలో వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ ను నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!