Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News What Are The States That Have Increased Da For Employees

DA Hike: ఉద్యోగులకు డీఏ పెంచిన ప్రభుత్వాలు.. ఏఏ రాష్ట్రాలు ఉన్నాయంటే..!

Published Date :November 9, 2023 , 6:23 pm
By Rajesh Veeramalla
DA Hike: ఉద్యోగులకు డీఏ పెంచిన ప్రభుత్వాలు.. ఏఏ రాష్ట్రాలు ఉన్నాయంటే..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

గత నెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ని పెంచింది. ఆ తర్వాత.. దీపావళికి ముందు డీఏ పెంచే ప్రకటనలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగాయి. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, చండీగఢ్‌లలో డీఏను పెంచి పండుగకు ముందు ఉద్యోగులకు సంతోషాన్ని ఇచ్చారు. అయితే డీఏల పెంపుపై ఏ రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం.

Skin Diseases: వాయు కాలుష్యంతోనే చర్మ వ్యాధులు.. డేంజర్ అంటున్న నిపుణులు..!

Also Read

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
  • Uttar Pradesh: బీజేపీ "మిషన్ యూపీ 2027" స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
  • Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్
  • BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ రాజకీయాలతో సంబంధం..
Add as a preferred
source on google

కేంద్ర ప్రభుత్వం 4 శాతం పెంచింది
అక్టోబర్ 18న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ భేటీలో 4 శాతం డీఏ పెంపుదల ప్రకటించారు. ఈ నిర్ణయం 2023 జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. దీంతో జీతం, పెన్షన్‌లో ప్రస్తుత డీఏ రేటు 46 శాతానికి పెరిగింది.

అస్సాంలో 5 లక్షల మంది ఉద్యోగులకు
కేంద్రంలాగే అస్సాంలోని హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం కూడా కరువు భత్యాన్ని 4 శాతం పెంచింది. అస్సాంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా లబ్ధి పొందనున్నారు. అస్సాంలో మొత్తం డీఏ ఇప్పుడు 46 శాతానికి చేరుకుంది. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని కేబినెట్ ఆమోదించిందని ముఖ్యమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

డీఏ పెంచిన యోగి ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని 4 శాతం నుండి 46 శాతానికి పెంచింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.2100 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ ఖాతా నుంచి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రగతికి దోహదపడుతున్న రాష్ట్ర ఉద్యోగులు, ఎయిడెడ్ విద్యా, సాంకేతిక విద్యాసంస్థలు, పట్టణ సంస్థలు, యూజీసీ ఉద్యోగులు, వర్క్‌చార్జ్డ్ ఉద్యోగులు, పింఛనుదారులందరూ దీని ప్రయోజనం పొందుతారని పోస్ట్ లో రాశారు. అంతేకాకుండా.. నాన్ గెజిటెడ్, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, రోజువారీ వేతన కార్మికులందరికీ 30 రోజుల వేతనాలకు (గరిష్టంగా రూ. 6908) బోనస్ ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని 14.82 లక్షల మంది ఉద్యోగులు బోనస్‌ ప్రయోజనం పొందనున్నారు.

కేంద్రంతో సమానంగా డీఏ ఇస్తాం- ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌
రాష్ట్ర ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డియర్‌నెస్‌ అలవెన్స్‌ ఇస్తామని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ చెప్పారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కరువు భత్యం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరింది. గతంలో రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపాదన సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపింది. అనుమతి పొందిన తరువాత రాజస్థాన్ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచారు. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ ఏడాది ఉద్యోగుల కరువు భత్యాన్ని రెండుసార్లు పెంచింది.

డీఏ పెంపుబాటలో చండీగఢ్, తమిళనాడు
తమిళనాడు, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తమ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపుదల ప్రయోజనాన్ని ఇవ్వాలని ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం.. ఈ పెంపుదల జూలై 1 నుండి అమలు చేయనుంది. దీంతో 16 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా.. ప్రభుత్వ ఖజానాపై రూ.2500 కోట్లకు పైగా భారం పడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central govt
  • DA Hike
  • employees
  • State Govt
  • telugu news

తాజావార్తలు

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత

  • Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!

  • Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..

  • Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు

  • Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions