Kolkata Rape Murder Case: సీఎం మమతకు ఉపశమనం.. సమ్మెను విరమించుకున్న జూనియర్ డాక్టర్లు..
- ఆగస్టు 9న కోల్కతా ఘటన.
- ఘటన జరిగినప్పటి నుంచి నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు.
- సమ్మెలో కూర్చున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు.
Kolkata Rape Murder Case: కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య తర్వాత సమ్మెలో కూర్చున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 9న కోల్కతా ఘటన జరిగినప్పటి నుంచి నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లంతా శనివారం (సెప్టెంబర్ 21) విధుల్లో చేరనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది గొప్ప ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే., ఆమె కోపంగా ఉన్న జూనియర్ డాక్టర్లను శాంతింపజేయడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వైద్యులు, సీఎం మమత మధ్య పలుమార్లు చర్చలు జరిగినా వైద్యులు మాత్రం తమ డిమాండ్లపై మాట్లాడేందుకు నిరాకరించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య దారుణమైన నేరం జరగడం గమనార్హం. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో పాటు ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, ఎస్హెచ్ఓను అరెస్టు చేసింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతోంది. దేశవ్యాప్తంగా సమ్మెలో ఉన్న డాక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. ఆ తర్వాత కోల్కతాలోని జూనియర్ డాక్టర్లు మినహా అందరూ తమ సమ్మెను ముగించారు.
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
కోల్కతాలోని జూనియర్ డాక్టర్ల సమ్మె వైద్య సేవలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చూసిన మమతా బెనర్జీ తనతో మాట్లాడేందుకు వైద్యుల బృందాన్ని చాలాసార్లు ఆహ్వానించారు. అయితే తమ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ డిమాండ్లన్నింటినీ ఆమోదించాలని వైద్యులు డిమాండ్ చేశారు. సీఎం మమత లైవ్ స్ట్రీమింగ్కు అంగీకరించకపోవడంతో పలుమార్లు సమావేశం రద్దయింది. ఇంతలో, సిఎం మమతా బెనర్జీ వైద్యులను కలవడానికి నిరసన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సాధ్యమైన అన్ని చర్యలకు హామీ ఇచ్చారు. దాంతో దాదాపు 41 రోజుల తర్వాత, జూనియర్ డాక్టర్లు సెప్టెంబర్ 20 శుక్రవారం నుండి స్వాస్త్య భవన్, కోల్కతాలో కొనసాగుతున్న నిరసనను ముగించి సెప్టెంబర్ 21 నుండి తిరిగి విధుల్లోకి వస్తారని ప్రకటించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో