Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు
- తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు..
- బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం..
- రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం ఏర్పడుతోంది. దీంతో ముసురు ఆగని పరిస్థితి.. వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ముసురు ఉధృతంగా పడిపోవడంతో రెండు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి చెరువులను నింపాయి. బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. భద్రాచలం సమీపంలో గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దిగువ పోలవరానికి 11 లక్షల 31 వేల క్యూసెక్కుల వరద వెళుతోంది. తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మోసెండ్ నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
Read also: Kargil Vijay Diwas 2024: కార్గిల్ విజయ్ దివాస్ చరిత్ర మీకు తెలుసా? రోమాలు నిక్కబొడిచే కథ..
Also Read
ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Read also: Janhvi Kapoor-NTR: నాకు 10 రోజులు పడితే.. ఎన్టీఆర్కు సింగిల్ సెకనే: జాన్వీ కపూర్
తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబైలో కుంభ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించింది. ఇప్పటికే ముంబై, పూణేలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కర్ణాటక, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలోని కొట్టాయం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొంకణ్-గోవా, గుజరాత్ మరియు ఒడిశాలో 12 సెం.మీ కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో పెను తుపాను వస్తుందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
BRS Leaders: నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్న బీఆర్ఎస్ టీం..
తాజావార్తలు
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!