Dola Sree Bala Veeranjaneya Swamy: రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తాం
- బలవంతంగా మాతో రాజీనామాలు చేయించారని వాలంటీర్ల ఆవేదన
- ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని మంత్రి వీరాంజనేయ స్వామి హామీ
ప్రజలు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పరిపాలన దక్షుడు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కటం అదృష్టమన్నారు.బాద్యతలు తీసుకున్న వెంటనే సీఎం హామీల అమలు మొదలు పెట్టారన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మాది విడతల వారీ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమన్నారు. ఐదు రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని తెలిపారు. తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని..రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. త్వరలో అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టబోతున్నామని స్పష్టం చేశారు.
READ MORE: BJP: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో బీజేపీ నేతల సీక్రెట్ సమావేశం..ఎజెండా ఏంటి?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఏపీ నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు. జిల్లాలో మైనింగ్ కు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎస్సీ కాలనీల్లో మూతబడిన పాఠశాలలు తెరిపిస్తామన్నారు. తమకు సచివాలయాలు, వాలంటీర్ల శాఖ ప్రకటించిన సమయం నుంచి నా మెయిల్లు, వాట్సాప్ లు నిండిపోయాయని తెలిపారు. బలవంతంగా మాతో రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన పెన్షన్లను ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు.
READ MORE:Amit Shah: త్వరలో.. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్..!
కాగా.. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. తన టీమ్ను సైతం సిద్ధం చేసుకున్నారు. మంత్రులకు సైతం శాఖలు కేటాయించారు. అయితే మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపులో.. వాలంటీర్లకు టీడీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. 24 మందికి శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖను ఏర్పాటు చేసి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి అప్పగించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో