Water Crisis: గుక్కెడు నీటి కోసం జనం తిప్పలు.. ప్రాణాలకు తెగిస్తున్న మహారాష్ట్రవాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాసిక్లోని కోశింపాడ గ్రామ ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసితులు తమ బిందేలు నింపడానికి బావిలోకి దిగుతున్నారు. నీటి ఎద్దడి గ్రామ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎండిపోతున్నట్లు కనిపించే ఈ భారీ బావి నుండి నీటిని తీసుకురావడానికి గ్రామస్థులు ప్రతిరోజూ గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈ వీడియోను న్యూస్ ఏజెన్సీ ANI షేర్ చేసింది.
Also Read : Avinash Reddy: నేడు విచారణకు అవినాష్రెడ్డి బెయిల్ పిటిషన్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
మహిళలు తాడు సాయంతో బావిలో దిగడం.. ప్లాస్టిక్ బిందేలు, టంబ్లర్లను ఉపయోగించి మురికి నీటిని సేకరిస్తున్నారు. బావి పైకి జాగ్రత్తగా స్కేలింగ్ చేసిన తర్వాత, దాని గట్లను మద్దతుగా ఉపయోగించడం ద్వారా, మహిళలు మురికి నీటిని ఫిల్టర్ చేసి మట్టి కుండల్లో నింపుకుంటున్నారు. కరువు, వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన మరియు తీవ్రమైన వర్షపాతం లేకపోవడం వంటి అంశాల కలయిక వల్ల నీటి సంక్షోభం ఏర్పడింది. వర్షాభావం వల్ల బావుల్లో నీటి మట్టం పడిపోవడం, వర్షాలు కురవకపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బందిగా మారింది. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం కూడా సమస్యకు కారణమైంది.
Also Read : Mahesh Babu: చిన్న సినిమాకి పెద్ద సపోర్ట్… ఒక్క ట్వీట్ తో జాతకం మార్చేశాడు
గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడిని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నీటి కనెక్షన్ ఉండేలా టెండర్ పాస్ చేశామని మహారాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్కుమార్ కృష్ణారావు గవిట్ తెలిపారు. 2024 వరకు ప్రతి గ్రామానికి జల్ జీవన్ మిషన్ కింద నీటి సౌకర్యం ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం టెండర్ ఆమోదించబడింది, ”అని మినిస్టర్ గవిట్ చెప్పారు. మహారాష్ట్రలో నీటి సంక్షోభం ముఖ్యంగా నాసిక్లోని మారుమూల కొండ గ్రామాలను తాకింది. నాసిక్తో పాటు రాయ్గఢ్, ఔరంగాబాద్ జిల్లాల్లో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
#WATCH | Maharashtra: Due to the water crisis, people of Koshimpada Village are compelled to consume; descent into a well to fetch water pic.twitter.com/6orDLsCpyQ
— ANI (@ANI) May 24, 2023
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!