IND vs WI: ఐపీఎల్లో ఆడలేదని.. ఆ ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు- వసీం జాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI: ఐపీఎల్లో ఆడలేదని అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లకు వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కలేదని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆరోపించారు. దేశవాళీ క్రికెట్లో వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని వసీం తెలిపాడు. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్టు జట్టును నిన్న ప్రకటించారు. ఇప్పుడు జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ టీమ్ ఎంపికపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు.
Read Also: Monsoon Update: హిమాచల్, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన
Also Read
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
అభిమన్యు ఈశ్వరన్ మరియు ప్రియాంక్ పంచల్ రంజీ మరియు ఇండియా ‘ఎ’ కోసం అద్భుతంగా రాణించారని వసీం జాఫర్ అన్నాడు. చాలా కాలంగా టెస్ట్ ల్లో కొత్త క్రికెటర్లకు అవకాశమివ్వాలని ఆయన చెబుతూనే ఉన్నాడు. మరోవైపు టెస్ట్ టీంలో రుతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేయడం పట్ల తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వెస్టిండీస్ పర్యటనలో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు టెస్టు జట్టులోకి ఎంపిక కాగా.. సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ సహా కొంతమంది ఆటగాళ్ల కోసం నిరీక్షణ కొనసాగుతోందని వసీం జాఫర్ తెలిపాడు. అయితే వెస్టిండీస్ తో టెస్టు జట్టు ఎంపిక చూసి చాలా నిరాశకు గురయైనట్లు తెలిపాడు. అంతేకాకుండా నలుగురు ఓపెనర్ల అవసరం ఏంటని ప్రశ్నించాడు. సర్ఫరాజ్ ఖాన్ను అదనపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఎంపిక చేసి ఉండవచ్చుగా అని జాఫర్ అన్నాడు. సర్ఫరాజ్ దేశీయంగా నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు.
Read Also: Bhola Shankar Teaser Launch Event Live: భోళా శంకర్ టీజర్ రిలీజ్ లైవ్
మరోవైపు మహ్మద్ షమీకి వెస్టిండీస్ టూర్ లో విశ్రాంతి ఇవ్వడంపై జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నెల రోజుల విరామం ఉన్నప్పటికీ షమీకి విశ్రాంతి ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. షమీ మంచి బౌలర్ అని, అతను ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే అంత ఫిట్ గా ఫామ్ లోకి వస్తాడన్నాడు. అయితే వసీం జాఫర్ తో పాటు మరికొంత మంది మాజీ ఆటగాళ్లు కూడా టీమిండియా సెలక్షన్ పై మండిపడుతున్నారు. దీంతో సెలక్టర్లు మరోసారి అయోమయంలో పడ్డారు.
టెస్ట్ స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!