Warangal: పోలీసుల ముందే బైక్కు నిప్పు పెట్టిన వ్యక్తి.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్లో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ ట్రాఫిక్ ఎస్సై రవి ఆధ్వర్యంలో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. శివనగర్ ప్రాంతానికి చెందిన పులిశేరు శివ పూటుగా మద్యం తాగి తన ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారని గ్రహించిన శివ.. ప్రధాన తపాలా కేంద్రం కూడలి రహదారి పక్కన ద్విచక్ర వాహనం నిలిపి రోడ్డు దాటుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ వచ్చావని, కేసు నమోదు చేస్తామని పోలీసులు అందడంతో శివ ఆవేశానికి గురయ్యాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Bigg Boss Telugu 7: బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ జాబితా ఇదే.. ఈసారి ఎవరెవరున్నారంటే?
శివ తన ద్విచక్ర వాహనం పెట్రోల్ పైపును తొలగించి.. నిప్పు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాఫిక్ పోలీసులు పక్కనే ఉన్న దుకాణంలో నుంచి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేశారు. ఆపై శివ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి.. వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కేంద్రానికి తరలించారు. అయితే తాను వాహనం నడుపుతూ దొరక లేదని, కేసు ఎలా నమోదు చేస్తారని శివ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబందింసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!