Kolkata Incident: ‘గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను’.. డైరీలో కోల్కతా డాక్టర్ రాసిన చివరి రాతలివే..!
- డాక్టర్ అయ్యేందుకు నా కూతురు చాలా కష్టపడింది
- దేశమంతా మద్దతు ఇవ్వడం మా కుటుంబానికి ధైర్యాన్నిస్తోంది
- నేరస్థులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Incident: కోల్కతా హత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రి.. తన కుమార్తె వ్యక్తిగత డైరీలో రాసుకున్న వివరాలను వెల్లడించారు. తన కోర్సులో బంగారు పతకాన్ని సాధించడం, ఎండీ పరీక్షలలో అగ్రస్థానం రావడమే లక్ష్యమని రాసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆమె రాత్రి షిఫ్ట్కి బయలుదేరే ముందు భయంకరమైన ఘటన జరిగిన రోజున ఈ విషయాన్ని రాసినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె కలలు ప్రతీది ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె రోజంతా పుస్తకాలలో మునిగిపోతుందని, ఆమె చాలా కష్టపడి పనిచేసేదని బాధితురాలి తండ్రి చెప్పారు. తన కుమార్తె ధైర్యసాహసాలకు మెచ్చుకుంటూ.. డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె చాలా పోరాడిందని అన్నారు. ఆమెను పెంచేటప్పుడు తాము చాలా త్యాగాలు చేశామన్నారు. తన కుమార్తెకు దేశవ్యాప్తంగా ఉన్న మద్దతును చూసి తాను పొంగిపోయానన్నారు.
Read Also: Russia-Ukraine War: 8 నెలల్లో రష్యా స్వాధీనం చేసుకున్న భూమిని 8 రోజుల్లో లాక్కున్న ఉక్రెయిన్!
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
ఏమి చేసినా కుమార్తెను తిరిగి పొందలేనని.. కానీ తాను చేయగలిగింది ధైర్యంగా పోరాడడమేనన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మద్దతు ప్రదర్శన న్యాయం కోసం పోరాడటానికి మాకు చాలా ధైర్యాన్ని ఇస్తోందని ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించడం గురించి మాట్లాడుతూ.. తన కుమార్తెను ఏదీ తిరిగి తీసుకురాలేదని, దాని గురించి ప్రత్యేక సంతృప్తి ఏమీ లేదని అన్నారు. తాము ఇప్పుడు కేవలం న్యాయం కోసం ఆశిస్తున్నామని చెప్పారాయన. తన కూతురిని ఇంత కిరాతకంగా చంపినందుకు నేరస్థులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. “వారు ఎంత త్వరగా శిక్షించబడితే అంత మంచిది. మాకు కొంత ఊరట లభిస్తుంది, అయినప్పటికీ మా నష్టాన్ని ఏదీ భర్తీ చేయదు” అని ఆయన అన్నారు. కాలేజీ యాజమాన్యం తన కూతురిని ఎప్పుడూ ఆదుకోలేదని చెప్పాడు. ఏ పార్టీ నుంచి కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు.
పోస్ట్గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం శుక్రవారం (ఆగస్టు 9) ఉదయం బెంగాల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్లో పాక్షిక నగ్న స్థితిలో కనుగొనబడింది. ఈ కేసుకు సంబంధించి కోల్కతా పోలీసుల పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల చనిపోయిందని మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి చెందిన ఒక అధికారి మొదట చెప్పారు. నాలుగు పేజీల శవపరీక్ష నివేదిక ఆమె మరణం గురించి భయంకరమైన వివరాలను వెల్లడించింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!