Kolkata Incident: ‘గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను’.. డైరీలో కోల్కతా డాక్టర్ రాసిన చివరి రాతలివే..!
- డాక్టర్ అయ్యేందుకు నా కూతురు చాలా కష్టపడింది
- దేశమంతా మద్దతు ఇవ్వడం మా కుటుంబానికి ధైర్యాన్నిస్తోంది
- నేరస్థులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Incident: కోల్కతా హత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రి.. తన కుమార్తె వ్యక్తిగత డైరీలో రాసుకున్న వివరాలను వెల్లడించారు. తన కోర్సులో బంగారు పతకాన్ని సాధించడం, ఎండీ పరీక్షలలో అగ్రస్థానం రావడమే లక్ష్యమని రాసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆమె రాత్రి షిఫ్ట్కి బయలుదేరే ముందు భయంకరమైన ఘటన జరిగిన రోజున ఈ విషయాన్ని రాసినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె కలలు ప్రతీది ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె రోజంతా పుస్తకాలలో మునిగిపోతుందని, ఆమె చాలా కష్టపడి పనిచేసేదని బాధితురాలి తండ్రి చెప్పారు. తన కుమార్తె ధైర్యసాహసాలకు మెచ్చుకుంటూ.. డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె చాలా పోరాడిందని అన్నారు. ఆమెను పెంచేటప్పుడు తాము చాలా త్యాగాలు చేశామన్నారు. తన కుమార్తెకు దేశవ్యాప్తంగా ఉన్న మద్దతును చూసి తాను పొంగిపోయానన్నారు.
Read Also: Russia-Ukraine War: 8 నెలల్లో రష్యా స్వాధీనం చేసుకున్న భూమిని 8 రోజుల్లో లాక్కున్న ఉక్రెయిన్!
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
ఏమి చేసినా కుమార్తెను తిరిగి పొందలేనని.. కానీ తాను చేయగలిగింది ధైర్యంగా పోరాడడమేనన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మద్దతు ప్రదర్శన న్యాయం కోసం పోరాడటానికి మాకు చాలా ధైర్యాన్ని ఇస్తోందని ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించడం గురించి మాట్లాడుతూ.. తన కుమార్తెను ఏదీ తిరిగి తీసుకురాలేదని, దాని గురించి ప్రత్యేక సంతృప్తి ఏమీ లేదని అన్నారు. తాము ఇప్పుడు కేవలం న్యాయం కోసం ఆశిస్తున్నామని చెప్పారాయన. తన కూతురిని ఇంత కిరాతకంగా చంపినందుకు నేరస్థులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. “వారు ఎంత త్వరగా శిక్షించబడితే అంత మంచిది. మాకు కొంత ఊరట లభిస్తుంది, అయినప్పటికీ మా నష్టాన్ని ఏదీ భర్తీ చేయదు” అని ఆయన అన్నారు. కాలేజీ యాజమాన్యం తన కూతురిని ఎప్పుడూ ఆదుకోలేదని చెప్పాడు. ఏ పార్టీ నుంచి కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు.
పోస్ట్గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం శుక్రవారం (ఆగస్టు 9) ఉదయం బెంగాల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్లో పాక్షిక నగ్న స్థితిలో కనుగొనబడింది. ఈ కేసుకు సంబంధించి కోల్కతా పోలీసుల పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల చనిపోయిందని మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి చెందిన ఒక అధికారి మొదట చెప్పారు. నాలుగు పేజీల శవపరీక్ష నివేదిక ఆమె మరణం గురించి భయంకరమైన వివరాలను వెల్లడించింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!