Jharkhand: నక్సలైట్ల ఏరియాలో ఓటింగ్.. ఇరువై ఏళ్ల తర్వాత ఓటు వేసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓట్లను బహిష్కరిస్తామనే నక్సలైట్ల బెదిరింపు నక్సలైట్ల ఆఖరి కంచుకోట అయిన సరంద మరియు కొల్హన్లోని దట్టమైన అడవుల్లో ఉన్న గ్రామాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లో నిర్మించిన బూత్ల వద్ద ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 20 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన తిరిల్పోసి, రెంగ్దహతు, బోరోయి గ్రామాల్లో ఓటింగ్ జరగలేదు. ఈ మూడు గ్రామాల్లో తొలిసారిగా ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచే ఈ కేంద్రాల వద్ద మహిళా, పురుష ఓటర్లు పోటెత్తారు. ఈ బూత్ల వద్ద గ్రామస్తులు తమ ఓటును పూర్తి ఉత్సాహంతో వేశారు.
దట్టమైన అడవిలో ఉన్న రెంగ్దహటు గ్రామంలో నాలుగు బూత్లు ఏర్పాటు చేశారు. వీటిలో రెంగదహతు, స్వయంభ, టెన్సారా, ముర్ముర పోలింగ్ కేంద్రాలను తయారు చేశారు. ఓటర్ల భద్రత కోసం 174 బెటాలియన్ల సైనికులను ఇక్కడ మోహరించారు. సర్జాంబూరు, తుంబహాక, పాతతరోబ్ గ్రామాలకు చెందిన ఓటర్లు కూడా ఈ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. ఇక్కడ మొత్తం నాలుగు బూత్లతో కలిపి 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగగా, రెంగ్దహటు బూత్లో 68.51 శాతం, ముర్ముర బూత్లో 62 శాతం, టెన్సారా బూత్లో 62.3 శాతం, స్వయంభ బూత్లో 66.94 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్ ప్రభావిత బూత్లలో ఓటింగ్ శాతం దాదాపు 65 శాతానికి చేరుకుంది.
Also Read
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
SBI BANK: చరిత్ర సృష్టించిన ఎస్బీఐ ఇండియా.. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్లో చేరిన తొలి బ్యాంక్..
ఓటింగ్ సరళిపై.. 174 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్నాథ్ జెనా మాట్లాడుతూ.. నిరంతర అవగాహన కార్యక్రమాలు, సిఆర్పిఎఫ్ క్యాంపు ఏర్పాటు కారణంగా ఇక్కడి ప్రజలు పూర్తి ఉత్సాహంతో నిర్భయ వాతావరణంలో ఓటు వేసినట్లు తెలిపారు. ఆరు, ఏడు కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన.. ద్విచక్రవాహనాలపై ప్రజలు ఈ బూత్లకు చేరుకుని ఓటు వేశారన్నారు. భద్రత దృష్ట్యా నాలుగు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లో ఒకరోజు ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లో మంగళవారం మళ్లీ చైబాసాకు పంపనున్నారన్నారు. అప్పటి వరకు ఈ పోలింగ్ కేంద్రం తమ రక్షణలో ఉంటుందరని తెలిపారు.
గోయిల్కెరా పోలీస్స్టేషన్ పరిధిలోని కుయిడా, ఛోటా కుయిడా, మరదిరి, మేరల్గడ, హతిబురు, తిలయాబెడ, బోయ్పైసాంగ్ సరిహద్దు ప్రాంతాలు, కటంబ, బయ్హతు, బోరై, లెంసడిహ్ గ్రామాలు, టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని హుసిపి, రాజబాస, తుంబహక, రెగడ, పట్టోరాబ్, గోబురు, లుయా గ్రామాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఈ గ్రామాలకు వెళ్లే దారిలో నక్సలైట్లు భారీ సంఖ్యలో ఐఈడీలను అమర్చారు. భద్రతా దళాలు 700 కంటే ఎక్కువ IEDలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ గ్రామాలకు రహదారులను సురక్షితంగా ఉంచారు. ఓటింగ్కు ఒకరోజు ముందు నక్సల్ ప్రభావిత బూత్లలోని సంబంధిత క్లస్టర్లకు ప్రత్యేక రైలు, ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా పోలింగ్ సిబ్బందిని పంపించారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?