Jharkhand: నక్సలైట్ల ఏరియాలో ఓటింగ్.. ఇరువై ఏళ్ల తర్వాత ఓటు వేసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓట్లను బహిష్కరిస్తామనే నక్సలైట్ల బెదిరింపు నక్సలైట్ల ఆఖరి కంచుకోట అయిన సరంద మరియు కొల్హన్లోని దట్టమైన అడవుల్లో ఉన్న గ్రామాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లో నిర్మించిన బూత్ల వద్ద ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 20 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన తిరిల్పోసి, రెంగ్దహతు, బోరోయి గ్రామాల్లో ఓటింగ్ జరగలేదు. ఈ మూడు గ్రామాల్లో తొలిసారిగా ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచే ఈ కేంద్రాల వద్ద మహిళా, పురుష ఓటర్లు పోటెత్తారు. ఈ బూత్ల వద్ద గ్రామస్తులు తమ ఓటును పూర్తి ఉత్సాహంతో వేశారు.
దట్టమైన అడవిలో ఉన్న రెంగ్దహటు గ్రామంలో నాలుగు బూత్లు ఏర్పాటు చేశారు. వీటిలో రెంగదహతు, స్వయంభ, టెన్సారా, ముర్ముర పోలింగ్ కేంద్రాలను తయారు చేశారు. ఓటర్ల భద్రత కోసం 174 బెటాలియన్ల సైనికులను ఇక్కడ మోహరించారు. సర్జాంబూరు, తుంబహాక, పాతతరోబ్ గ్రామాలకు చెందిన ఓటర్లు కూడా ఈ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. ఇక్కడ మొత్తం నాలుగు బూత్లతో కలిపి 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగగా, రెంగ్దహటు బూత్లో 68.51 శాతం, ముర్ముర బూత్లో 62 శాతం, టెన్సారా బూత్లో 62.3 శాతం, స్వయంభ బూత్లో 66.94 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్ ప్రభావిత బూత్లలో ఓటింగ్ శాతం దాదాపు 65 శాతానికి చేరుకుంది.
Also Read
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
SBI BANK: చరిత్ర సృష్టించిన ఎస్బీఐ ఇండియా.. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్లో చేరిన తొలి బ్యాంక్..
ఓటింగ్ సరళిపై.. 174 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్నాథ్ జెనా మాట్లాడుతూ.. నిరంతర అవగాహన కార్యక్రమాలు, సిఆర్పిఎఫ్ క్యాంపు ఏర్పాటు కారణంగా ఇక్కడి ప్రజలు పూర్తి ఉత్సాహంతో నిర్భయ వాతావరణంలో ఓటు వేసినట్లు తెలిపారు. ఆరు, ఏడు కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన.. ద్విచక్రవాహనాలపై ప్రజలు ఈ బూత్లకు చేరుకుని ఓటు వేశారన్నారు. భద్రత దృష్ట్యా నాలుగు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లో ఒకరోజు ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లో మంగళవారం మళ్లీ చైబాసాకు పంపనున్నారన్నారు. అప్పటి వరకు ఈ పోలింగ్ కేంద్రం తమ రక్షణలో ఉంటుందరని తెలిపారు.
గోయిల్కెరా పోలీస్స్టేషన్ పరిధిలోని కుయిడా, ఛోటా కుయిడా, మరదిరి, మేరల్గడ, హతిబురు, తిలయాబెడ, బోయ్పైసాంగ్ సరిహద్దు ప్రాంతాలు, కటంబ, బయ్హతు, బోరై, లెంసడిహ్ గ్రామాలు, టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని హుసిపి, రాజబాస, తుంబహక, రెగడ, పట్టోరాబ్, గోబురు, లుయా గ్రామాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఈ గ్రామాలకు వెళ్లే దారిలో నక్సలైట్లు భారీ సంఖ్యలో ఐఈడీలను అమర్చారు. భద్రతా దళాలు 700 కంటే ఎక్కువ IEDలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ గ్రామాలకు రహదారులను సురక్షితంగా ఉంచారు. ఓటింగ్కు ఒకరోజు ముందు నక్సల్ ప్రభావిత బూత్లలోని సంబంధిత క్లస్టర్లకు ప్రత్యేక రైలు, ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా పోలింగ్ సిబ్బందిని పంపించారు.
తాజావార్తలు
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!