Suicide Case: ఐఫోన్ కొనివ్వలేదని.. అత్మహత్య చేసుకున్న యువకుడు!
- విశాఖలోని పెందుర్తిలో విషాదం
- ఐఫోన్ కొనివ్వలేదని అత్మహత్య చేసుకున్న యువకుడు
- పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులకు కడుపు కోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పరీక్షలో ఫెయిల్ అయ్యాను అన్న భయంతోనో, జాబ్ రాలేదు అన్న దిగులుతోనో, లేదంటే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఉచ్చులో పడి యువత ఆత్మహత్యలు చేసుకోడం చూస్తుంటాం. కానీ ఈ ఘటన మాత్రం బాధ పడాలో, ఓదార్చాలో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు ఖరీదైన ఐ ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై జీవితాన్నే ఫణంగా పెట్టాడు. మూర్ఖంగా ప్రవర్తించి అత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. కేవలం ఓ ఐ ఫోన్ కోసం పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. చేతికంది వచ్చిన కొడుకు సూసైడ్ చేసుకోవడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
తల్లిదండ్రులు ఐ ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు సూసైడ్కు పాల్పడిన ఘటన విశాఖలోని పెందుర్తిలో జరిగింది. సుజాతనగర్ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ స్టాక్ మార్కెటింగ్ విధులు నిర్వర్తిస్తుంటారు. ఈయనకు సాయి మారుతి కెవిన్ అనే పాతికేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి కొన్నాళ్ల పాటు సినీరంగంలో ఫొటోగ్రఫీ విభాగంలో పని చేశాడు. ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్తో కొన్నాళ్ళు ఆడుతూ పాడుతూ ఇష్టమైన ప్రొఫెషన్లో కొనసాగాడు. అయితే మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు జిరిగాయో.. ప్రస్తుతం ఇంటికి తిరిగి వచ్చి ఖాళీగా ఉంటున్నాడు.
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
ఈ మధ్య ఐఫోన్లో వచ్చిన కొత్త సీరీస్పై మోజు పెంచుకున్నాడు. కొన్ని రోజులుగా ఐఫోన్ కొనాలని తండ్రిని అడుగుతున్నాడు. ఖర్చుతో కూడుకున్న మొబైల్ కావడంతో తండ్రి నిరాకరించినట్లు సమాచారం. తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు సాయి మారుతి కెవిన్. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రం 5 గంటలైనా బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో గడియ విరగ్గొట్టి చూడగా సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. కిందకు దించి చూసేసరికి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు. కేవలం ఐ ఫోన్ కోసం సాయి మారుతి కెవిన్ సూసైడ్ చేసుకోవడం.. స్థానికంగా అందరినీ కలవరపెడుతోంది.
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!