Aaryavir Sehwag: ఇక దబిడి దిబిడే.. డబుల్ సెంచరితో రెచ్చిపోయిన వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు
- డబుల్ సెంచరితో రెచ్చిపోయిన వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్
- కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ
- ఆర్యవీర్ డబుల్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaryavir Sehwag: ప్రస్తుత రోజుల్లో క్రికెట్ ఆటగాళ్ళు టెస్ట్ మ్యాచ్లలో కూడా టి20 మ్యాచ్ ఆడుతున్నట్లుగా బ్యాటింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇది వరకు దశాబ్దం క్రితం టెస్టు క్రికెట్ అంత ఈజీ కాదు. ఆ సమయంలోనే భారత డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను విపరీతంగా బాధేసేవాడు. ఇప్పుడు, సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తన తండ్రిలానే నడుస్తున్నట్లు కనపడుతోంది. తాజాగా మ్యాచ్ లో అద్భుతాలు చేశాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ ఆర్యవీర్ డబుల్ సెంచరీ సాధించాడు.
Also Read: Koti Deepotsavam 2024 Day 13 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం.. ప్రత్యక్షప్రసారం
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
నవంబర్ 21న మేఘాలయతో జరిగిన మ్యాచ్లో ఆర్యవీర్ డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 229 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను రెండో రోజు ఆట ముగిసే వరకు 200 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆర్యవీర్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు, అతని స్ట్రైక్ రేట్ 87.34. వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు కూచ్ బెహార్ ట్రోఫీలో ఆడడం ఇదే తొలిసారి. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇదే తొలి సెంచరీ.
ఈ మ్యాచ్లో అర్నవ్ బగ్గాతో కలిసి 17 ఏళ్ల ఆర్యవీర్ 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 114 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అర్నవ్, ధన్య నక్రాతో కలిసి 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ధన్యా నక్ర అజేయంగా 98 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. వెటరన్ క్రికెటర్ కుమారుడు వినూ మన్కడ్ ట్రోఫీ మ్యాచ్లలో ఇప్పటికే మంచి ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచాడు. ఆ టోర్నమెంట్లో, అతను 49 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ని ఆడి, జట్టు గెలవడంలో ముఖ్యమైన సహకారం అందించాడు.
Also Read: Terrorist Attack: ఉగ్రదాడిలో 50 మంది హతం..
వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు బ్యాటింగ్కు పేరుగాంచాడు. తన కెరీర్లో భారతదేశం తరపున 104 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అందులో ఏకంగా 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. సెహ్వాగ్ ఈ సుదీర్ఘ ఫార్మాట్లో 8,586 పరుగులు చేశాడు. 6 డబుల్ సెంచరీలతో పాటు, అతను 23 సెంచరీ ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్ కూడా సెహ్వాగ్ పేరునే ఉంది. అతను 91 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డ్ సమీపాన రోహిత్ శర్మ కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!