IND vs NZ: చిరుతలా పరిగిత్తే కోహ్లీ జోరుకు బ్రేక్ పడిందా..? రనౌట్ వీడియో
- డైరెక్ట్ హిట్తో కోహ్లీని రనౌట్ చేసిన మ్యాట్ హెన్రీ
- 6 బంతుల్లో 4 పరుగులు చేసి రనౌట్
- తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 86/4..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు మ్యాట్ హెన్రీ వికెట్లకు డైరెక్ట్ త్రో కొట్టి కోహ్లీని పెవిలియన్కు పంపాడు.
ఐదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లి.. రచిన్ రవీంద్ర వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మిడ్ ఆన్ వైపు లైట్ షాట్ ఆడాడు. అతను సింగిల్ తీయడానికి ప్రయత్నించగా.. హెన్రీ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకొని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్లో కొట్టాడు. అయితే.. కోహ్లీ ఫుల్ డైవ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. దీంతో.. తీవ్ర నిరాశతో కోహ్లీ గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. 6 బంతులు ఆడిన కోహ్లీ.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో.. కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత టెస్టు సిరీస్లో 5 ఇన్నింగ్స్ల్లో 92 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
Read Also: Terrorist Attack In Budgam: ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు యువకులు మృతి
ఇదిలా ఉంటే.. ముంబై టెస్టులో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశారు. అయితే ఈ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. 18 బంతుల్లో 18 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్కు తొలి దెబ్బ తగిలింది.
ఆ తర్వాత.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 52 బంతుల్లో 30 పరుగులు చేశాడు. భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను సెకండ్ డౌన్లో పంపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సిరాజ్ ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యాడు. 18వ ఓవర్లో యశస్వి, సిరాజ్లు స్పిన్నర్ అజాజ్ పటేల్ ఓవర్లో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ (31), రిషబ్ పంత్ (1) ఉన్నారు. మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది.
HEART-BREAKING MOMENT OF THE DAY 💔 pic.twitter.com/st8IQrc692
— Johns. (@CricCrazyJohns) November 1, 2024
తాజావార్తలు
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!